కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక జరిగింది. అధ్యక్షరేసులో ఉన్న మల్లికార్జున ఖర్గే బెంగళలూరులో ఓటేశారు. సోనియా, ప్రియాంక, మన్మోహన్ సహా పలువురు ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఖర్గేతోపాటు కేరళకు చెందిన సీనియర్ నేత శశిథరూర్ పోటీలో ఉన్నారు. 24 ఏళ్ల తర్వాత గాంధీయేతర కుటుంబాలకు చెందిన వ్యక్తులు ఈ పదవి కోసం పోటీ చేస్తున్నారు. సీనియర్ నాయకుడు,గాంధీ కుటుంబ మద్దతు ఉన్న మల్లికార్జున ఖర్గేకే విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయి.
ఎలక్టోరల్ కాలేజీలోని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) ప్రతినిధులు సహా మొత్తం 9 వేల మంది ఈ ఎన్నికలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. ఎన్నికల ప్రక్రియ రహస్య బ్యాలట్ విధానంలో జరిగింది. ఏఐసీసీ ప్రధాన కార్యాలయం సహా దేశవ్యాప్తంగా 65 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 137 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతుండడం ఇది ఆరోసారి.