ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు మరియు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై అతని మాజీ సహచరుడు, కవి అయిన కుమార్ విస్వాస్ చాలా భయంకరమైన ఆరోపణ చేసాడు.
కేజ్రీవాల్ ఖలిస్తాన్ వాదులతో కుమ్మక్కు అయ్యాడు అని తాను వారి మద్దతుతో పంజాబ్ ముఖ్యమంత్రి లేదా భవిష్యత్ లో ఖలిస్తాన్ దేశానికి ప్రధాని అవుతానని తనతో చెప్పినట్లు కుమార్ విశ్వాస్ ఆరోపించాడు.
దీనిపై కేజ్రీవాల్ స్పందిస్తూ అతని ఆరోపణలు హాస్యాస్పదమైనవి అని కొట్టి పారేస్తూ తాను ఖలిస్తానీయులతో కుమ్మక్కు అయితే కేంద్ర నిఘా ఏజెన్సీలు ఏం చేస్తున్నాయి? తనను టెర్రరిస్టుగా ప్రకటించి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? నేను ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించే మంచి టెర్రరిస్టు ను అని చెప్పాడు.
దానికి కుమార్ విశ్వాస్ స్పందిస్తూ కేజ్రీవాల్ కి నిజంగా ఖలిస్తాన్ వాదులతో సంబంధం లేకపోతే కేజ్రీవాల్ తాను ఖలిస్తానీయులకు వ్యతిరేకం అని, ప్రత్యేక ఖలిస్తాన్ కి, ఖలిస్తాన్ ఆందోళనకు వ్యతిరేకం అని బహిరంగంగా ప్రకటన చేయమనండి అని సవాల్ విసిరాడు. అంతే కాక కేజ్రీవాల్ ఆ ప్రకటన చేయలేడు ఎందుకంటే అతని మీద మదుపు పెట్టిన (ఖాలిస్తాన్ మద్దత్తు దారులు) వారికి కోపం వస్తుంది అని కేజ్రీ కి తెలుసు అని కూడా కుమార్ విశ్వాస్ ఆరోపించాడు.
ఈ సవాల్ పై కేజ్రీ ఏమి స్పందించకుండా మౌనం వహించాడు. అలాగే ఇంత దారుణమైన ఆరోపణలు చేసిన కుమార్ విశ్వాస్ పై ఎటువంటి పరువు నష్టం దావా కూడా వెయ్యలేదు.
కేజ్రీ ఖాలిస్తాన్ వాదులతో కుమ్మక్కు అయినట్లు గతంలో కూడా ఆరోపణలు వచ్చాయి. పంజాబ్ లో ఉగ్రవాదాన్ని అరికట్టిన మాజీ పోలీస్ చీఫ్ KPS గిల్ కూడా ఆప్ పార్టీ మీద 2017 ముందు ఇటువంటి అరోపణే చేశారు.. ఆప్ తెలియకుండా ఉగ్రవాదులకు స్తానం కల్పిస్తోంది అని చెప్పారు. ఎందుకంటే గత ఎన్నికలు అప్పుడు ఖలిస్తాన్ పెద్ద మద్దత్తుదారు ప్రస్తుతం లండన్ లో ఉంటున్న గురిందర్ స్వంత ఇంట్లో మోగా ఊర్లో కేజ్రీవాల్ రాత్రి బస చేసాడు. ఈ గురిందర్ సింగ్ మాజీ టెర్రరిస్టు ఖలిస్తాన్ కామెండో ఫోర్స్ సభ్యుడు కూడా.
ఆమ్ ఆద్మీ పార్టీ ప్రారంభం నుండి కూడా కెనడా దేశంలో ఉన్న NRI లతో బాగా సంబంధాలు మెయింటైన్ చేస్తోంది. స్వయంగా కేజ్రీవాల్ కెనడా వెళ్లి ఆప్ పార్టీ కోసం ప్రత్యేక ఫండ్ రైజింగ్ కార్యక్రమాలు కూడా నిర్వహించాడు.
రాబోయే రోజుల్లో ఇది ఏ మలుపు తిరుగుతుందో చూడాలి..
Courtesy :- Chada Shastry

Photo Copied from (Financial Express)