కేరళ పాలిటిక్స్.. కమలం గూటికి పరుగుల రాణి..!
కేరళలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అధికారంలో ఉన్న పినరయ్ విజయన్ ప్రభుత్వానికి ఈ సారి బిగ్ షాక్ తగలనుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తన మిత్ర పక్షాలతో గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీ అవుతుంటే.. మరోవైపు దక్షిణాన ఎలాగైనా ఈ సారి పాగా వేయాలన్న పక్కా ప్లాన్తో బీజేపీ ఉవ్విల్లూరుతోంది. ఈ క్రమంలో కేరళలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను పార్టీలోకి స్వాగతిస్తోంది. దీంతో ప్రముఖులు బీజేపీ గూటికి చేరుతున్నారు. అంతేకాదు.. రాష్ట్రంలో బీజేపీ అధికారం చేపట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే మెట్రోమ్యాన్గా పేరొందిన శ్రీధరన్ త్వరలో బీజేపీ గూటికి చేరబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా క్రీడా రంగానికి చెందిన వారు కూడా బీజేపీలోకి క్యూ కడుతున్నారు. ప్రముఖ అథ్లెట్ పరుగుల రాణి పీటీ ఉషా కూడా బీజేపీలోకి చేరబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే కమలనాథులు పీటీ ఉషాతో చర్చలు కూడా జరిపినట్లు సమాచారం.