శబరిమల ఆలయంలో పవిత్ర అరవాన్నం ప్రసాదాలు నిలిచిపోయాయి. ప్రసాదం తయారీ, విక్రయాలను నిలిపేయాల్సిందిగా కేరళ హైకోర్టు శబరిమల దేవస్వోం బోర్డును ఆదేశించింది. రసాయనాలు వినియోగించిన యాలకులను ప్రసాదం తయారీలో వాడారన్న ఆరోపణలు వచ్చాయి. నివేదిక ఆధారంగా హైకోర్టు ఈ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఆ యాలకులు లేకుండా ప్రసాదం తయారు చేసి విక్రయించుకోవచ్చంది ధర్మాసనం. యాలకులను దేవస్వోం బోర్డు అయ్యప్ప స్పైసెస్ నుంచి కొనుగోలు చేసింది. 2022-2023 సీజన్లో యాలకుల కాంట్రాక్ట్ ను కొల్లాంకు చెందిన సప్లయర్స్ కంపెనీకి అప్పగించిందని అయ్యప్ప స్పైసెస్ ఆరోపించింది. నాణ్యతపైనా కంపెనీ ఫిర్యాదు చేయడంతో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లాబ్ లో పరీక్షించగా పరిమితికి మించి రసాయనాలున్నట్టు తేలింది.