నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ NCERT 12 వ తరగతి పాఠ్య పుస్తకాలనుంచి తొలగించిన భాగాలను స్టేట్ సిలబస్ లో చేర్చాలని కేరళ సర్కారు నిర్ణయించింది. తొలగించిన పాఠ్యాంశాలను స్టేట్ సిలబస్లో చేర్చడం ద్వారా అనుబంధ పాఠ్య పుస్తకాలను తీసుకురావాలని నిర్ణయించింది.ఎన్సీఈఆర్టీ ఇటీవల 11, 12 తరగతికి చెందిన చరిత్ర, రాజకీయ శాస్త్రం పుస్తకాల నుంచి కొన్ని భాగాలను తొలగించింది. మహాత్మాగాంధీ హత్య, గుజరాత్ అల్లర్లు, మొఘలుల చరిత్ర, ఆర్ఎస్ఎస్పై నిషేధం వంటి కొన్ని ముఖ్యమైన భాగాలను పాఠ్యాంశాల నుంచి తొలిగించింది. అయితే ఈ చర్యతో కేరళ సర్కారు విభేదించింది. పాఠ్య పుస్తకాల్లో చరిత్రను వక్రీకరించే కుట్రను కేంద్రప్రభుత్వం చేస్తోందని సీఎం పినరయ్ మండిపడ్డారు. ఎన్సీఈఆర్టీనీ పునర్వస్థీకరించాలని, ఇందులో రాష్ట్ర ప్రతినిధులకు చోటు కల్పించాలని డిమాండ్ చేసింది ఆ రాష్ట్ర సర్కారు.
అందులో భాగంగా స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (SCERT) పాఠ్యాంశాల స్టీరింగ్ కమిటీ సమావేశమైంది. ఎన్సీఆర్టీ 11, 12వ తరగతి సోషల్, రాజకీయ శాస్త్రంలో తొలగించి భాగాలపై సమగ్రంగా చర్చించింది. కేంద్రం చర్య సహేతుకం కాదని అభిప్రాయపడింది. రేషనలైజేషన్ పేరుతో తొలగించిన భాగాలను కేరళ పాఠ్యాంశాల్లో యథాతథంగా ఉంచాలని అభిప్రాయపడింది. తొలగించిన భాగాలను అనుబంధ పాఠ్యపుస్తకాలలో చేర్చి… రెండు నెలల్లో పాఠ్యపుస్తకాలను సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Thiruvananthapuram, Kerala| The curriculum committee has directed that the children must be taught the portions that were removed from NCERT and notify Kerala CM and Centre regarding this decision. Complaint will be given to PM & union education minister over the removal of key… pic.twitter.com/iJ5hKb4Gfh
— ANI (@ANI) April 26, 2023