కమ్యూనిజం ప్రపంచమంతటినీ, మానవాళి అందరినీ పరిగణనలోకి తీసుకొని మానవ జీవితాన్ని సుఖప్రదం చేయగోరుతున్న సిద్ధాంతం.
మానవుల పాలిట మత్తుమందుగా పేర్కొనడానికి కారణమైన క్రైస్తవం, ఇస్లాంలగురించి వారు మాట్లాడరు. ఇదేమిటని ఎవరన్నా అడిగితే అల్ప సంఖ్యాక వర్గాల మతతత్వం తక్కువ ప్రమాదకర మని, అధిక సంఖ్యాక ప్రజానీకపు మతతత్వం ఎక్కువ ప్రమాదకరమని వివరణలిస్తుంటారు.
పాకిస్థాన్ ఏర్పాటుకు దోహదపడిన కమ్యూనిస్టులు అక్కడి అధిక సంఖ్యాకులైన ముస్లింలు హిందువు లను ఊచకోత కోసినా, నోరెత్తలేక పోయారు. జ్యోతిబసు వంటి మూర్ధన్య నాయకమ్మన్యులు కాందిశీకులై హిందూస్థాన్ కి తరలివచ్చారు. ఇప్పుడు ఈ హిందూస్థాన్లో ముస్లింలు పేట్రేగిపోయి, హిందువు లను అనేకవిధాల హింసిస్తూ ఉంటే కట్టెదుట వాస్తవాలను ఎదుర్కొనటం చేతగాక అధిక సంఖ్యాకుల మతతత్వం అల్పసంఖ్యాకుల మతతత్వం కంటే ఎక్కువ ప్రమాదకర మని అరిగి పోయిన రికార్డును వినిపిస్తున్నారు.
కేరళ ముఖ్యమంత్రి కుమార్తె ఒక ముస్లిం సిపి(ఎం) నాయకునికి రెండవ భార్య అయ్యింది. కొద్ది సంవత్సరాలలోనే ఆరాష్ట్రంలో పార్టీ నాయకత్వం ఆ మహమ్మదీయ నాయకుని చేతుల్లోకి పోవటం ఖాయమని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.
కార్మిసంఘాల పేరున, కమ్యూనిస్టు పార్టీపేరున కేరళలో ఊరూరా ఆస్తులు ఉన్నాయి. వీటిపై పెత్తనం చలాయించగలవారు రాబోయేరోజులలో పార్టీ ఓటమిపారయినప్పటికీ తమవరకు జీవితం గడిచిపోగలదనే ధీమాతో ఉన్నారు.
యువతరం కొద్దిమంది మాత్రమే ఆ పార్టీలోకి వస్తున్నారు. అధికారం తమ పార్టీచేతులనుండి జారిపోగలదన్న ఊహ వారిని కలవర పెట్టుతున్నది. మతంకాదు, కమ్యునిస్టు సిద్ధాంతమే పెద్ద మత్తు మందుఅని, తమ భవిష్యత్తు, కేరళ భవిష్యత్తు అత్యంత ప్రమాదకరమైన మలుపు తీసుకో బోతున్న వని, దిగజారిపోతున్నవనీ తెలిసి నప్పటికీ ఏమీ మాట్లాడ జాలని దుస్థితి వారిది.
లోలోపల కుమిలిపోతున్నవారిని మరింతగా సంక్షోభంలో పడవేస్తున్న పరిణామాలు కేరళలో జరుగు తున్న రాజకీయ హత్యలు. ఎవరైతే కమ్యునిస్టు, మతోన్నాద ముస్లింలీగు, కేరళ కాంగ్రెసు, కాంగ్రెసు పార్టీల భృత్యులు సాగిస్తున్న హింసా కాండకు, మారణ హోమాలకూ తమ ఆత్మీయులను కోల్పోతున్నారో, ఇంతకాలంగా వారు నోరెత్తి ప్రశ్నించటం లేదు. ఐతే ఈపరిస్థితి ఇంక ఎంతోకాలం కొనసాగగలస్థితి లేదు.
పైనచెప్పిన పార్టీల బ్లాక్ మెయిలింగ్ కి లొంగిపోయిన తమ పార్టీ నాయకత్వపు వైఖరి వారిని ఆలోచింప జేస్తున్నది. కేరళ సాంస్కృతిక వారసత్వం పూర్తిగా తుడిచి పెట్టబడటం వారిని ఆందోళనకు గురి చేస్తున్నది. వారినుండి వినబడుతున్న గుసగుసల నిరసన ధ్వనులకు స్పందనగానే తమ పార్టీ కార్యకార్తలు హిందూ దేవాలయాల్లో జరిగే ఉత్సవాలకు నాయకత్వం వహించవచ్చునని సి.పి.(ఎం) అనుమతించింది. లావాలా పెల్లుబుకుతున్న అసంతృప్తిని ఈ పైపూత మందులు ఎంతవరకు నియంత్రించ గలవు? అనే ప్రశ్నకు రానున్న జవాబు దేశ వ్యాప్తంగా రాజకీయ నాయకుల కనులు తెరిపించేదిగా ఉండగలదు.
~ వడ్డి విజయసారథి