కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏపై కేరళ సీఎం పినరయ్ విజయన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సీఏఏ.. దేశ ప్రజలను విభజించేలా ఉందని.. దేశ ప్రజలను విభజించేందుకే ఈ చట్టాన్ని తీసుకువచ్చారని ఆరోపించారు. సీఏఏను ఎల్డీఎఫ్ వ్యతిరేకిస్తుందని తేల్చిచెప్పారు. యూపీలో ఓ రైల్లో క్రైస్తవ నన్పై దాడి జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ.. హిందుత్వంపై భిన్నమైన నమ్మకాలు ఉన్న వారిని ఆర్ఎస్ఎస్ భరించలేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కేరళలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు దేశ వ్యాప్తంగా ఎంతో కీలకమని.. దేశ ప్రజలు కేరళ ప్రజల తీర్పు కోసం వేచిచూస్తున్నారని అన్నారు. ఎల్డీఎఫ్ ప్రభుత్వం అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తుందని.. కానీ బీజేపీ తీరు ప్రజల మధ్య విభేదాలు తెచ్చేలా ఉంటుందని ఆరోపించారు.