కేరళకు చెందిన ప్రముఖనటి సబీనా లతీఫ్ హిందూమతాన్ని స్వీకరించింది. అలెప్పుజాకు చెందిన సబీనా ..ముస్లిం తల్లిదండ్రులకు జన్మించింది. కానీ ఇకనుంచి తన పేరు లక్ష్మీప్రియ అని తన మతం మార్చుకుంటున్నట్టు సోషల్మీడియాలో పేజీల్లో గెజిట్ ప్రతిని షేర్ చేస్తూ ప్రకటించింది. మతం పేరుతో హిందువులమీద జరుగుతున్న దాడుల్ని భరించలేకే ఈ పనిచేస్తున్నట్టు తెలిపింది. హిందువు అయిన జయేశ్ ను పెళ్లి చేసుకున్న లతీఫ్. …అతనితో పెళ్లి తరువాతనే తన జీవితంలోకి స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు వచ్చాయని అంది. ఆ ప్రకటన వల్లే మలయాళ ఇండస్ట్రీలో ఆమెకు సినిమా అవకాశాలు తగ్గాయని చెబుతారు. సోషల్మీడియాలోనూ ఆమెకు నిత్యం బెదిరింపులువస్తుంటాయి. అయితే ఇక తాను ఎవరికీ భయపడబోనని హిందువుగానే జీవిస్తానని తెగేసి చెబుతోంది మునుపటి సబీనా….నేటి లక్ష్మీప్రియ.