కశ్మీరీ పండిట్ల మారణహోమం, కశ్మీర్ లోయ నుంచి పండిట్ల తరిమివేతపై వచ్చిన కశ్మీర్ ఫైల్స్ ను అవహేళన చేస్తూ శాసనసభలో సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కేజ్రీ వ్యాఖ్యలను నిరసిస్తూ.. వందలాది మంది కశ్మీరీ పండిట్లు ఢిల్లీలోని ఆయన నివాసం వెలుపల నిరసన చేపట్టారు.
కశ్మీరీ పండిట్ల బృందం ఢిల్లీలో ఇంద్రప్రస్థ మహిళా కళాశాల నుంచి సివిల్ లైన్స్లోని ఫ్లాగ్స్టాఫ్ రోడ్లోని సిఎం కేజ్రీవాల్ నివాసానికి ర్యాలీగా బయలుదేరింది. కశ్మీర్, కశ్మీరీ పండిట్ల సమస్యపై పనిచేసే ‘ఇండియా 4 కాశ్మీర్’ అనే సంస్థ ఈ నిరసనలను నిర్వహించింది. కేజ్రీవాల్ వ్యాఖ్యలను ఇండియా 4 కశ్మీర్ తీవ్రంగా ఖండించింది. కశ్మీరీ పండిట్లు కోల్పోయిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి.. కశ్మీర్లోని భారతీయులకు గౌరవంగా, గర్వంగా పునరావాసం కల్పించడానికి పాన్-ఇండియా ప్రచారం చేసింది. “కశ్మీర్లో హిందూ మారణహోమం”పై సీఎం అగౌరవ, అపహాస్యపు వ్యాఖ్యలపై వారు మండిపడ్డారు. నిరసనకారులు కొందరు వీధి వెలుపలనే నిలిపివేశారు.
సంఘటనా స్థలంలో ప్రదర్శన చేస్తున్న ఒక వర్గం నినాదాలు చేసింది. నిరసనకారులలో కొందరు ముందుకు వెళ్లి సిఎం నివాసం గేటుపై ఎర్రటి ఇంక్ పోశారు. ఉద్రిక్తం నెలకొనడంతో కొంతసేపు కేజ్రీవాల్ ఇంటి వద్దకు ఎవరినీ అనుమతించలేదు.
1990 నుంచి ఇస్లామిక్ ఉగ్రవాదం వల్ల నిరాశ్రయులైనవారు, మారణహోమానికి బలైన వారి కుటుంబ సభ్యులకు సంఘీభావం తెలిపేందుకే వచ్చినట్టు వారు తెలిపారు.
నాటి ఘటనను ‘నకిలీ’ అని ఎగతాళి చేస్తూ ఆయన చేసిన ప్రకటన సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియా 4 కశ్మీర్ జెనోసైడ్ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించవలసిందిగా భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తోంది. తద్వారా దానిని అధికారికంగా గుర్తించి, క్రోడీకరించాలి” అని పత్రికా ప్రకటనలో తెలిపింది సంస్థ.
https://twitter.com/i4Kashmir/status/1509142776830922757?s=20&t=z34OP4G7rTzre99A6Z60mA
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)