
Arvind Kejriwal(Left) Kumar Vishwas(Right)
అప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఖలిస్తాన్ ప్రధాని కావాలని కోరుకున్నారని ఆప్ మాజీ నాయకుడు, ఒకప్పుటి కేజ్రీ సన్నిహితుడు కుమార్ విశ్వాస్ అన్నారు. ఆ విషయాన్ని తనతో స్వయంగా చెప్పారని ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో విశ్వాస్ బయటపెట్టారు. వేర్పాటువాదులకు కేజ్రీ మద్దతిచ్చారని… తాను పంజాబ్ ముఖ్యమంత్రి అయినా అవుతాను లేదా ఖలిస్తాన్ స్వతంత్ర్య దేశానికి ప్రధానిని అయినా అవుతానని చెప్పుకునేవారనీ వివరించారు. ఎన్నికల్లో ప్రయోజనం కోసం ఖలిస్తానీ ఉద్యమానికి మద్దతిస్తున్న వేర్పాటువాదుల మద్దతు తీసుకోవద్దని తాను చెప్పానన్నారు. ఐఎస్ఐ సహా ఇతర సంస్థలు ఖలిస్తాన్ ఉద్యమానికి నిధులు సమకూరుస్తున్నాయని నేనంటే అందుకు చింతించాల్సిన అవసరం లేదని తనన్నారని చెప్పుకొచ్చారు. నేను ఆ రాష్ట్రానికి సీఎం అవుతాను లేదా స్వతంత్ర్య దేశానికి పీఎం అవుతానని చాలాసార్లు నాతో అన్నారని కుమార్ విశ్వాస్ అన్నారు.
https://twitter.com/ANI/status/1493846434164383745?s=20&t=PjQPZSAGtsMt_s32P9B6HA
2018లో, నటి గుల్ పనాగ్ కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. ఖలిస్తానీ మద్దతుదారులను కె గ్యాంగ్ గా ప్రస్తావిస్తూ వాళ్లు ఎప్పటికీ పంజాబ్ ను అర్థం చేసుకోలేరు. కె గ్యాంగ్ ఎన్నికల్లో ప్రభావం చూపుతుంది. అది పంజాబీలందరికీ బాగా తెలుసు అని ఆమె ట్వీట్ చేశారు.
2017 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా..నిషేధిత ఇంటర్నేషనల్ సిఖ్ యూత్ ఫెడరేషన్ గుర్డియాల్ సింగ్ కేజ్రీవాల్ తరపున ప్రచారం చేశారు. 2018లో పంజాబ్ ఎన్నికల సందర్భంగా ఖలిస్తాన్ గ్రూపులనుంచి ఆప్ కు నిధులు అందినట్టు తరువాత రిపబ్లిక్ టీవీ కూడా వెల్లడించింది.