ఢిల్లీ మద్యం స్కాం కేసులో కుంభకోణం కేసులో ఈడీ దూకుడు పెంచింది. కేజ్రీవాల్ పీఏకి సమన్లు జారీ చేసింది. నాలుగురోజుల క్రితం ఆదివారం హాజరుకావాలని డిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోడియాకూ సీబీఐనుంచి నోటీసులు అందిన సంగతి తెలిసిందే. విచారణకు హాజరవుతానని సిసోడియా ప్రకటించారు. గతేడాది అక్టోబర్ 17న కూడా సీబీఐ ఆయన్ని ప్రశ్నించింది. మద్యం పాలసీపై ఆరోపణలు రావడంతో దాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఎక్సైజ్ శాఖలో అవినీతిని కప్పిపుచ్చేందుకే కొత్త మద్యం పాలసీని వెనక్కి తీసుకుని పాత విధానాన్నే అమల్ల్లోకి తెచ్చారని బీజేపీ ఆరోపిస్తూ వస్తోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని సీబీఐ అరెస్ట్ చేసింది. ముందు అభిషేక్ బోయినపల్లి, సమీర్ మహేంద్రు, శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబును ఈడీ అరెస్ట్ చేయగా..ఇటీవలే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దగ్గర చార్టెడ్ అకౌంటెంట్ గా పనిచేసిన గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అరెస్ట్ చేసింది.
https://twitter.com/ANI/status/1628666781618569216?s=20