కోవిడ్ ఉధృతి, తీసుకోవాల్సిన చర్యలపై ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశం వేదిగ్గా డిల్లీ సీఎం కేజ్రీవాల్ పై మండిపడ్డారు ప్రధాని మోదీ. ముఖ్యమంత్రులతో మోదీ రివ్యూ కార్యక్రమాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ టెలికాస్ట్ చేయడంపట్ల ప్రధాని అసహనం వ్యక్తం చేశారు. కేజ్రీ మాట్లాడుతుండగా..అసలేం జరుగుతోంది. ఇది పద్ధతి కాదు కదా అని మోదీ అనడంతో …వెంటనే కేజ్రీవాల్ సారీ చెప్పారు. సమావేశం గురించి కేంద్రం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని..ఇకనుంచి అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉంటామని ఆయన చెప్పారు.
అసలేం జరిగిందంటే సమావేశంలోఆక్సిజన్ కొరత గురించి ప్రధాని దృష్టికి తీసుకెళ్లే సందర్భంలో కేజ్రీవాల్ ‘కోవిడ్ పై పోరాడేందుకు జాతీయ ప్రణాళిక ఉంటేనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వెళ్లగలవు” అనికేజ్రీ మాట్లాడుతుండగా… మోదీ కల్పించుకుని “సలేం జరుగుతోంది..ఇది మన సంప్రదాయాలకు, నిబంధనలకు విరుద్ధం..అంతర్గత సమావేశాన్ని ముఖ్యమంత్రి ప్రసారం చేయిస్తున్నారు. ఇది సరికాదు. మనం సంయమనంతో ఉండాలి”అంటూ గట్టిగానే అన్నారు. దీంతో కేజ్రీవాల్ క్షమించాలని… ఇక జాగ్రత్తగా ఉంటామంటూ కొనసాగించారు.
తరువాత ఇదే విషయమై ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయం వివరణ ఇచ్చింది.ప్రధానితో సమీక్షా సమావేశాన్ని ప్రసారం చేయవద్దని లిఖితపూర్వకంగా కానీ, మౌఖికంగా కానీ తమకెలాంటి ఆదేశాలు, సూచనలు అందలేదని అందుకే కేజ్రీ ప్రసంగాన్ని లైవ్ లో షేర్ చేశామని తెలిపింది. ప్రజలకు సంబంధించిన అంశంపై చర్చ కనుక దాపరికాలేం ఉంటాయని…గతంలోనూ లైవ్ చేసిన సందర్భాలున్నాయని సీఎంవో వివరణ ఇచ్చింది. అయితే నిజంగానే లైవ్ టెలికాస్ట్ వల్ల ఎవరికైనా అసౌకర్యం కలిగినట్లైతే అందుకు విచారం వ్యక్తం చేస్తున్నామంటూ ప్రకటనలో తెలిపింది.