ఢిల్లీలో ఆరురోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించారు సీఎం కేజ్రీవాల్ రాత్రి పదిగంటలనుంచి అమల్లోకి రానుంది. దేశంలో ప్రమాదకరపరిస్థితిలోకి వెళ్లిన రాష్ట్రాల్లో ఢిల్లీ ఉంది. ఇది కచ్చితంగా కేజ్రీ బాధ్యతారాహిత్యం అని చెప్పవచ్చు.
4 నెలలు నుంచి 5 వేల నుంచి 10వేల మంది రైతులు ఢిల్లీ బార్డర్స్ లో ధర్నా చేస్తున్నారు. ఒక్కరూ కోవిడ్ ప్రోటోకాల్ అంటే సోషల్ డిస్టెన్స్ మైంటైన్ చెయ్యడం కానీ మాస్క్ లు పెట్టుకోవడం వంటివి గానీ చెయ్యడం లేదు.
సామూహిక స్నానాలు, సామూహిక వంటలు, సామూహిక భోజనాలు, గానాబజానాలు మొ. చేశారు.
పై పెచ్చు రోజూ కొత్త ఊర్లు నుండి, రాష్ట్రాల నుండి రైతులను తరలించడం, ఒకరోజు, రెండు రోజులు ధర్నాలో కోర్చోబెట్టడం తిరిగి వారి వారి ప్రదేశాలకు పంపడం చేశారు. ఒక పక్క ఈ ధర్నా దేశంలో కరోనా సూపర్ స్ప్రెడ్ గా మారే అవకాశం ఉంది అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే వున్నారు. కనీసం సుప్రీంకోర్టు చట్టాలు పెండింగ్ లో పెట్టిన తరువాత అయినా ధర్నా ఆపించవలసింది. కానీ ఈ ధర్నా లో నిజంగా రైతుల సమస్యల కంటే రాజకీయాలకే ప్రాధాన్యత ఇచ్చారు కదా! అందుకే ఆపే ప్రయత్నం చేయలేదు.
ఈ ధర్నాకు ప్రతిపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాల నుండి ఎక్కువ రైతులను తరలించారు.
ముందే టెస్ట్ లు చేసుకొని రావాలి అనే నిబంధన ఏమి పెట్టలేదు. కానీ ఏ మీడియా కానీ ఏ ప్రతిపక్ష పార్టీ కానీ ఏ మేధావి కానీ దీని గురించి వేలెత్తి చూపలేదు, ప్రశ్నించలేదు. ఈ ధర్నా వల్ల దేశంలో కోవిడ్ పెరగవచ్చు అని జాగ్రత్తలు చెప్పలేదు.
పై పెచ్చు ఢిల్లీలో నవంబర్ నెలలో కోవిడ్ కేస్ లు బాగా పెరిగిపోతే కేజ్రీవాల్ చేతులు ఎత్తేసి అమిత్ షా ని సాయం అడిగితే అమిత్ షా కలుగచేసుకొని కోవిడ్ సంఖ్య తగ్గే దాకా మానిటర్ చేశారు. అదే విషయం అప్పుడు మీడియాలో కూడా వచ్చింది.
మరి ఈ టైం లో కేజ్రీవాల్ ఏం చేశారు? ధర్నా చేస్తున్న రైతులకు ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళ బస్సులు ఆరేంజ్ చెయ్యడం, టెంట్స్, వాటర్ ట్యాంకర్లు, తాత్కాలిక హాస్పిటల్స్, తాత్కాలిక టాయిలెట్స్, అంబులెన్స్ లు ఎరేంజ్ చేసే పనిలో బిజీ గా వున్నారు.
అంతే కాదు జనవరి ఫిబ్రవరి నెలల్లో మహారాష్ట్రలో వేల మంది రైతులతో కనీసం మాస్కులు కూడా పెట్టుకోకుండా ర్యాలీలు నిర్వహించారు.
ఇప్పుడు ఏ రాష్ట్రాలలో కేసులు ఎక్కువగా ఉన్నాయి? 70% కేసులు ప్రతిపక్ష పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల నుండే వస్తున్నాయి. అంటే ఈ ప్రతిపక్ష రాష్ట్రాల్లో ఎక్కువగా కేసులు పెరగడానికి ఈ రైతుల ధర్నా పరోక్షంగా సాయం చేసిందా?
ఒక పక్క ఢిల్లీలో నవంబర్ నెలలో కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉంటే వాటిని అదుపుచెయ్యడం మానేసి, చేతకాక చేతులు ఎత్తేసి కేంద్రాన్ని ఒక పక్క సాయం అడుగుతూ కేంద్రం ఎదో లాగా ఢిల్లీ బోర్డర్ లో రైతుల ధర్నా అపుదామని ప్రయత్నిస్తూ ఉంటే కేంద్రానికి అడ్డు పడుతూ ఆ రైతులకు అన్ని రకాల సదుపాయాలు సమకూర్చడాన్ని టెంపరితనం అంటారా? సిగ్గులేని బాధ్యతా రాహిత్యం అంటారా?
ఈ కేజ్రీని ఢిల్లీ ప్రజలు దేనికి ఎన్నుకున్నారు? ఢిల్లీ సామాన్య ప్రజలకు చుట్టుప్రక్కల గ్రామాల్లో ఉన్నవారు ఈ ధర్నా వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటే రాజ్యాంగ పదవిలో ఉన్న ముఖ్యమంత్రి గా ఎవరి బాగోగులు చూడాలి? ఢిల్లీ సామాన్య ప్రజలవా? ధర్నా రైతులవా?
కానీ కేజ్రీ చేతులెత్తేశాడు… కేంద్రాన్ని సాయం కోరుతున్నాడు. తిప్పి కొడితే మూడు కోట్లు జనాభా లేని ఢిల్లీలో ఇప్పుడు నాలుగురోజులుగా రోజుకు 25,000 కేసులు. అలాంటి సీఎంను వెనకేసుకువస్తున్న వాళ్లను ఏమనాలి..
…చాడా శాస్త్రి…