హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రమైన కేదార్నాథ్ కు వెళ్లే మార్గంలో రోప్వే నిర్మించే ప్రక్రియ ప్రారంభమైనందున త్వరలో శివుని భక్తులు మరింత సౌకర్యవంతంగా, తక్కువ సమయంలో ఆలయాన్ని సందర్శించగలరు.
కేదార్నాథ్ – హేమకుండ్ సాహిబ్ల మధ్య రోప్వే కోసం డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (DPR) సిద్ధంగా ఉంది. ఉత్తరాఖండ్ ప్రజలకు ఉపాధి, ఆదాయాన్ని అందించడంలో ఈ పర్యాటకం కీలక పాత్ర పోషిస్తోంది. 2019లో రాష్ట్రానికి 37 మిలియన్ల దేశీయ పర్యాటకులు వచ్చారు, దీంతో అక్కడ మెరుగైన కనెక్టివిటీని అందించాల్సిన తక్షణ అవసరం ఉందని స్పష్టంగా కనిపిస్తుంది. కనెక్టివిటీని పెంచడానికి ముఖ్యంగా ప్రధాన పర్యాటక ప్రదేశాలలో రాష్ట్రవ్యాప్తంగా రోప్వే లైన్లను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.
నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ (NHLML) చేపట్టిన కొన్ని రోప్వే ప్రాజెక్టులు సోన్ప్రయాగ్-గౌరీకుండ్-కేదార్నాథ్, గోవింద్ ఘాట్-ఘంగారియా-హేమ్కుండ్, రాణి బాగ్ నుంచి నైనిటాల్లోని హనుమాన్ దేవాలయం, పంచకోటి – బౌరాది (న్యూ తెహ్రీ), మున్సియరీ నుంచి ఖలియా టాప్, రిషికేష్ నుంచి నీలకంట్ సహా ఔలీ నుంచి గోర్సన్.
పైన పేర్కొన్న ప్రాజెక్టులలో సోన్ప్రయాగ్-గౌరీకుండ్-కేదార్నాథ్ తోపాటు గోవింద్ ఘాట్-ఘంగారియా-హేమకుండ్ రోప్వే ప్రాజెక్టుల కోసం అటవీ భూమి బదిలీ ప్రక్రియ ప్రారంభమైంది. సోన్ప్రయాగ్-గౌరీకుండ్-కేదార్నాథ్ రోప్వే ప్రాజెక్టు పొడవు 13 కిలోమీటర్లు కాగా ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.985 కోట్లకుపైగా ఉంది.
సముద్ర మట్టానికి 11,500 అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే అతి పొడవైన రోప్వేగా నిర్మించనున్నారు, ఇది రుద్రప్రయాగ్ జిల్లాలోని కేదార్నాథ్ పుణ్యక్షేత్రానికి యాత్రికులు చేరుకోవడానికి పట్టే సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. రోప్వే సోన్ప్రయాగ్ నుంచి కేదార్నాథ్కు 60 నిమిషాల్లో ప్రయాణించేందుకు వీలు కల్పిస్తుంది.