తెలంగాణ రాష్ట్ర సమితి …భారత రాష్ట్ర సమితిగా పూర్తిగా మారిపోయింది. పార్టీ ఆవిర్భావ వేడుకల్ని ఘనంగా నిర్వహించింది పార్టీ . పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో సీఎం, పార్టీ చీఫ్ కేసీఆర్ బీఆర్ఎస్ ను లాంఛనంగా ప్రారంభించారు. మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాలకు బీఆర్ఎస్ పత్రాలపై ఆయన సంతకాలు చేశారు. దీంతో ఇక పూర్తిస్థాయిలో పార్టీ బీఆర్ఎస్ అయిపోయింది. తరువాత పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. అది కూడా గులాబీరంగులోనే ఉంది.. మధ్యలో తెలంగాణ స్థానంలో భారతదేశ పటాన్ని చేర్చారు. ఇంతకుముందు జెండాపై జై తెలంగాణ ఉండేది..ఇప్పుడు జై భారత్ అని మార్చారు. జెండా ఆవిష్కరణకు ముందే నూతన కండువాలనూ ఆయన ఆవిష్కరించి… తనకు తానే మెడలో వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జేడీఎస్ నేత కుమారస్వామి, ప్రకాశ్ రాజ్ సహా పలువురు పాల్గొన్నారు.