తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర రైతు సంఘాల నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర రైతు నేత శరత్ జోషి సహా పలువురు బీఆర్ఎస్ లో చేరారు. ప్రగతి భవన్లో వారికి పార్టీ కండువా కప్పి సభ్యత్వం అందజేశారు కేసీఆర్. రైతులు తలుచుకుంటే ఏదైనా సాధ్యమవుతుందని..కేంద్రం తీసుకువచ్చిన 3 చట్టాలను రైతు నిరసనల వల్లే రద్దు చేశారని గుర్తు చేశారు. తెలంగాణలో రైతులు పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉందని…తాముఅధికారంలోకి వచ్చిన తరువాతనే రైతుల ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టాయని కేసీఆర్ అన్నారు. తెలంగాణ తరహాలో దేశంలోని రైతుల పరిస్థితులు ఉండాలని సీఎం అన్నారు.
https://twitter.com/BRSparty/status/1642091197840900098?s=20