అటు రాహుల్ పై అనర్హత వేటు వేయడాన్ని విపక్ష పార్టీలు తప్పుబడుతున్నాయి. ఈ విషయంలో రాహుల్ కు మద్దతుగా నిలిచిన తెలంగాణ సీఎం కేసీఆర్…. మోదీ పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందన్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులను సాధిస్తూ మోదీ తన పతనాన్ని తానే కొనితెచ్చుకుంటున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఓ ప్రకటన విడుదల చేసిన కేసీఆర్ భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలోనే ఇది చీకటిరోజన్నారు. రాహుల్ లోక్ సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం మోదీ దురహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్న మోదీ…ప్రజాస్వామ్య వేదిక పార్లమెంట్ నూ తన హేయమైన చర్యల కోసం వాడుకుంటున్నారని విమర్శించారు.
రాహుల్ పై అనర్హత వేటును తప్పుబట్టిన కేసీఆర్ – మోదీ పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందని ఆగ్రహం
Share: