పాలమూరు జిల్లాలో చీఫ్ బండి సంజయ్ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ కొనసాగుతోంది. 21వ రోజు యాత్రలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ ఆఫీస్ సెక్రటరీ కామర్సు బాలసుబ్రమణ్యం పాల్గొన్నారు.
“కేసీఆర్ కుటుంబపాలన, నియంతృత్వ, అవినీతి పాలనకు వ్యతిరేకంగా బండి సంజయ్ చేస్తున్న పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిపై వ్యతిరేకతతో గ్రామాల్లోని ప్రజలు వేలాదిగా తరలివచ్చి బండి సంజయ్ పాదయాత్రలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని… కేసీఆర్ కబంధ హస్తాల నుంచి తెలంగాణను కాపాడేందుకు బీజేపీ చేస్తున్న పోరాటమిదని ఆయన అన్నారు. ప్రజల సమస్యలు తీర్చలేని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి, ప్రజలను కాపాడేందుకు ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నారని… కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాలంటే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాల్సిందేనని కామర్సు అన్నారు.