తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనానుంచి కోలుకున్నారు. పూర్తిగా కోలుకున్నఆయన చాలాకాలానికి ప్రగతి భవన్ కు వచ్చారు. ఏప్రిల్ 19న ఆయనకు కరోనా అని తేలింది. దీంతో ఆయన గజ్వేల్ లోని తన ఫాంహౌజ్ లోనే ఐసోలేషన్లో ఉన్నారు. 28న ఫాంహౌజ్ కే వెళ్లి డాక్టర్లు ర్యాపిడ్ టెస్టులు చేశారు. నెగెటివ్ వచ్చింది. అయితే ఆర్టీపీసీఆర్లో మాత్రం మిశ్రమ ఫలితాలు వచ్చాయి. దీంతో ఆయన ఫాంహైస్ లోనే ఉండిపోయారు. చివరకు మే 4న కరోనానుంచి సీఎం పూర్తిగా కోలుకున్నట్టు వైద్యులు చెప్పారు. దీంతో రెండు వారాల తరువాత ఆయన ప్రగతి భవన్ చేరుకున్నారు.