ధాన్యం కొనుగోలుకు సంబంధించి టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఫైట్ సాగుతోంది. ఈ దుస్థితికి మీరంటే మీరు కారణమంటూ ఇరు పార్టీల నాయకులూ పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీని ఇరుకునపెట్టేందుకు కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. కేంద్రంతో ఇక తాడో పేడో తేల్చుకునే ఉద్దేశంతో స్వయంగా కేసీఆరే ఢిల్లీలో ధర్నాకు దిగబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈనెల 29న దీక్ష దివస్ సందర్భంగా సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ధర్నాకు దిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదేరోజు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నందున కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఇదే మంచి తరుణమని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

file photo