కేసీఆర్ భాష మరీ దిగజారుడుతనంగా ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేంద్రప్రభుత్వంపై, మోదీపై ఆయన చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలేనని అన్నారు. స్వప్రయోజనాల కోసం దేశ సమగ్రతను దెబ్బతీసేలా కేసీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యం అంటే కుటుంబ పాలన అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. మోదీ ఏడున్నరేళ్ల పాలనపై …అవాస్తవాలు, దిగజారుడు భాష కాక..అర్థవంతమైన చర్చకు తాము సిద్ధమని సవాల్ చేశారు. ఆదివారం మరోసారి రెండున్నర గంటలకు పైగా ప్రెస్మీట్ నిర్వహించిన ముఖ్యమంత్రి కేంద్రం, మోదీ లక్ష్యంగా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)