కేసీఆర్ తో , టీఆర్ఎస్ గూండాలతో తనకు ప్రాణహాని ఉందన్నారు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిళ. తానంటే కేసీఆర్కు భయం పట్టుకుందని, తన పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక పోలీసుల ద్వారా ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. తన పాదయాత్ర.. కేసీఆర్కు అంతిమ యాత్ర కాబోతుందనీ అన్నారు షర్మిళ. టీఆర్ఎస్ నేతలు చేసిన అవినీతి, అక్రమాలను ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నందునే తనపై ౖ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.మహిళఅనే గౌరవం ఇవ్వకుండా తనను మరదలు అంటూ సంభోదిస్తే తప్పుకాదా అన్న ఆమె..అందుకే చెప్పుతో కొడతానన్నానని అన్నారు.