బీజేపీ నేతల జోకర్ ట్వీట్పై స్పందించారు ఎంపీ ధర్మపురి అరవింద్. కేటీఆర్ డ్రగ్స్ తీసుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఫైరయ్యారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి భూమే ఇవ్వలేదన్నారు. బీజేపీ నేతలం జోకర్లం కాదని.కేసీఆరే థర్డ్ క్లాస్ బ్రోకర్ అని అన్నారు.ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్నPFI ని కేసీఆర్ ప్రోత్సాహిస్తున్నారు.
లిక్కర్ స్కాంలో కవిత, ఫీనిక్స్ , బిల్డర్స్ స్కాంలో కేటీఆర్ అరెస్ట్ అవుతారని జోస్యం చెప్పారు అర్వింద్.
కేటీఆర్, కవిత అరెస్ట్ అవుతారని… వారికోసం జైళ్లశాఖ మంత్రి జైలు సిద్ధం చేసుకోవాలన్నారు. నాలుగు రోజుల్లో కవితను ఢిల్లీ లిక్కర్ స్కాం లో విచారణకు పిలుస్తారు. అదే రోజు అరెస్ట్ చేస్తారు. కేటీఆర్కు నార్కోటిక్ పరీక్ష చేయాలనీ అన్నారు.