బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసే ప్రయత్నంలో బిజీ అయ్యారు తెలంగాణ సీఎం కేసీఆర్. హస్తిన పర్యటనలో ఉన్న ఆయన.. బీకేయూ అధికార ప్రతినిధి, రైతు నాయకుడు రాకేష్ టికాయత్ తో సమావేశమయ్యారు. టికైత్తో పాటు, బీజేపీ ఎంపి సుబ్రహ్మణ్యస్వామీ భేటీలో పాల్గొన్నారు. సమావేశంలో తెలంగాణ ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, టీఆర్ఎస్ ఎంపీ సంతోష్కుమార్ తదితరులు పాల్గొన్నారు.రైతు చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఆందోళనలో ప్రాణాలు కోల్పోయిన ప్రతీరైతు కుటుంబానికి రూ.3 లక్షలు అందజేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
దాదాపు ఏడాదిపాటు పాటు సాగిన ఆందోళనల్లో 700 మంది రైతులు మరణించారు. SKM డిమాండ్పై హర్యానా ,యుపి ప్రభుత్వాలు మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించడానికి అంగీకరించాయి.
2024 లోక్సభ ఎన్నికల కోసం ప్రాంతీయ పార్టీల కూటమిని ఏర్పాటు చేసే ప్రయత్నాల మధ్య కేసీఆర్ తాజా చర్య పాన్-ఇండియా నాయకుడిగా ఎదగడానికి మరో ప్రయత్నంగా కనపడుతోంది.
సుబ్రహ్మణ్య స్వామి రాజ్య సభ పదవీకాలం ఈ సంవత్సరం ఏప్రిల్ 24 న ముగియనుంది. బీజేపీ విధానాలనూ కొంతకాలంగా విమర్శిస్తూ వస్తున్నారు స్వామి. ఇప్పుడు TRS నుంచి రాజ్యసభ సీటును కోరినట్లు ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.