తెలంగాణ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల. శ్రీరామ్ సాగర్ నీళ్లు ఎత్తిపోసుకోవచ్చని మహారాష్ట్రకు హామీ ఇచ్చారని… అప్పనంగా నీళ్లు అర్పించడానికి నీళ్లు కేసీఆర్ సొంత ఆస్థా అని ఆమె నిలదీశారు. ఇప్పటికే పార్టీలో తెలంగాణ పేరు తీసేసిన కేసీఆర్… ఇక తన రాజకీయాల కోసం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ను దారాదత్తం ఎలా చేస్తారని ప్రశ్నించారు. ప్రాజెక్ట్ తెలంగాణ ఆస్తి అని… అసలిప్పుడు జై తెలంగాణ అనే దమ్మే ఆయనకు లేదని ఆమె వ్యాఖ్యానించారు. నిన్న నాందేడ్ సభ వేదిగ్గా…మహారాష్ట్రకు నీళ్లు ఇచ్చేందుకు సిద్ధమన కేసీఆర్ అన్న సంగతి తెలిసిందే. మహారాష్ట్ర సహకారంతోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తైందన్నారు. అవసరమైతే శ్రీరాంసాగర్ నీళ్లను మహారాష్ట్ర లిఫ్ట్ చేసుకోవచ్చన్నారు.షర్మిల ప్రజాదీవెన యాత్ర వరంగల్ జిల్లాలో కొనసాగుతోంది. హైదరాబాద్ తర్వాత వరంగల్ను ఐటీ హబ్ చేస్తామని మాట ఇచ్చారని, కానీ ఒక్క ఐటీ కంపెనీ కూడా రాలేదని వమిర్శించారు డల్లాస్ నగరంగా వరంగల్ను మారుస్తానని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు.
శ్రీరాంసాగర్ నీళ్లు మహారాష్ట్రకు అర్పించడానికి కేసీఆర్ ఆస్థా?- షర్మిళ
Share: