అటు డిల్లీ లిక్కర్ స్కామ్ లో తనపై ఆరోపణలు చేసిన బీజేపీ నేతలపై పరువు నష్టం దావా వేశారు ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీకి చెందిన బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మజుందర్ సిస్రా ప్రెస్ మీట్ పెట్టి మరీ స్కాంలో కవితకు హస్తం ఉందని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆ ప్రకంపనలు తెలంగాణకు పాకాయి. బీజేపీ నేతలతో పాటు కాంగ్రెస్ సైతం కవితను టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగింది. అయితే ఢిల్లీ లిక్కర్ పాలసీకి తనకు సంబంధం లేదని కవిత స్పష్టం చేశారు. ఏ విచారణకైనా సిద్ధమన్న ఆమె ఇవాళ బీజేపీ నేతలపై పరువునష్టం దావా వేశారు.
https://twitter.com/ANI/status/1561630331756691458?s=20&t=A0XoUFhUelViHpRLB9anOw