రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటకు ముందు టీఆర్ఎస్ నాయకురాలు కవిత ట్విట్టర్ వేదిగ్గా కాంగ్రెస్ నాయకున్ని, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. రాహుల్ ను ఉద్దేశించి.. మీరు కానీ, మీ పార్టీ కానీ తెలంగాణ గురించి ఎన్ని సార్లు పార్లమెంట్ లో ప్రస్తావించారు? దేశ వ్యాప్తంగా ఒకే వారి కొనుగోలు విధానంపై టీఆర్ఎస్ పార్టీ పోరాడుతున్నప్పుడు మీరు ఎక్కడున్నారు?
తెలంగాణ ప్రాజెక్టులకు రావాలిన జాతీయ హోదాపై.. పెండింగ్ జీఎస్టీ బకాయిల నిధుల గురించి టీఆర్ఎస్ పోరాటం చేస్తుంటే మీరు ఎటుపోయారు?తెలంగాణ లో హక్కుల కోసం మా పార్టీ పోరాడుతుంటే అప్పుడు మీరెక్కడ ఉన్నారు? అంటూ ప్రశ్నలు సంధించారు.
https://twitter.com/RaoKavitha/status/1522404168987648000?s=20&t=WV16qPiOm3-wp-KMpoOmjQ
దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. “కవిత గారు మీరు రాహుల్ గాంధీ ని ప్రశ్నించే ముందు నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు చట్టాలు తెచ్చినప్పుడు మీరు ఎక్కడున్నారు? మీ నాన్న ఇక నుంచి తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ ఇవ్వమని చెప్పి లేఖ ఇచ్చి రైతులకు ఉరితాళ్లు బిగించినపుడు మీరెక్కడున్నారు?
వరి వేస్తే ఉరే అని ప్రకటించి, తన 150 ఎకరాల ఫామ్ హౌస్ లో మాత్రం అదే పంట వేస్తే అప్పుడు ఎక్కడ ఉన్నారు?
రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పి, ఇవ్వకుంటే ప్రశ్నించారా మీరు?
రాష్ట్రానికి రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీ , బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ లలో ఏ ఒక్కటీ సాధించలేని మీకు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని , రాహుల్ గాంధీని ఇలా ప్రశ్నించడానికి సిగ్గుగా లేదా” అని ఎదురుదాడి చేశారు. ఈ ఇద్దరు నాయకుల ట్వీట్లపై నెటిజన్లు సైతం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
https://twitter.com/revanth_anumula/status/1522424923368529920?s=20&t=WV16qPiOm3-wp-KMpoOmjQ