సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ సమన్లు పంపింది. ఫిబ్రవరి-9న విచారణకు రావాలని నోటీసులో పేర్కొంది. అయితే ఈనెల 15న వస్తానని కవిత లేఖ రాశారు. అయితే 15న కాక…11నే విచారణకు రావాలని బదులిచ్చింది. అంతకుముందు ఈడీ రిప్లై కోసం ఎదురుచూసిన కవిత తన షెడ్యూల్ ప్రకారం ఢిల్లీ వెళ్లారు. చట్టసభల్లో మహిళలకు 33 రిజర్వేషన్ల డిమాండ్ తో ఆమె గురువారం జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ వెళ్తూ కేసీఆర్ కు ఫోన్ చేసి మాట్లాడారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని… ఢిల్లీలో చేపట్టిన కార్యక్రమం కొనసాగించాలని..బీజేపీ కక్షసాధింపు చర్యలపై న్యాయపరంగా పోరాడుతామని ఆయన కవితకు ధైర్యం చెప్పినట్టు తెలిసింది.
అటు కవితకు ఈడీ సమన్ల నేపథ్యంలో రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. కవిత ఈడీ విచారణపై చర్చించనుంది.
కవిత అరెస్ట్ అయితే ఏం చేయాలనేదానిపై మంత్రివర్గం చర్చించనుంది.