తెలంగాణలో దోచుకున్నది చాలక ఇంకా దోచుకోవడానికే కేసీఆర్ కుటుంబం ఢిల్లీమీద పడిందని మాజీమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. డిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పాత్ర ఉందో లేదో దర్యాప్తు సంస్థలు తేలుస్తాయన్నారు. తెలంగాణ కోసం అమరుడైన కానిస్టేబుల్ కిష్టయ్య వర్దంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు ఈటల. రాష్ట్రంలో టీఆర్ఎస్ ను ఎదిరించి ఓడించే సత్తా కేవలం బీజేపీకే ఉందని అన్నారు