ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆడిటర్ బుచ్చిబాబుకు బెయిల్ వచ్చింది.రౌస్ అవెన్యూ కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పాస్ పోర్టు అప్పగించాలని…దేశం విడిచి వెళ్లరాదని షరతులు విధించింది. ఫిబ్రవరి 8న బుచ్చిబాబును అరెస్ట్ చేసిన సీబీఐ అదే రోజు ఆయన్ని కోర్టులో హాజరుపరిచింది.ముందు మూడురోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించిన కోర్టు. తరువాత మరో 14 రోజులు పొడిగించింది. గడువు ముగిసిన తరువాత కూడా మరో 14 రోజులు కోర్టు కస్టడీ విధించింది. ఆయన బెయిల్ పిటిషన్ పై విచారణను వాయిదా వేస్తూ వచ్చిన కోర్టు ఇవాళ బెయిల్ మంజూరు చేసింది.