ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ తాజా చార్జిషీట్లో బీఆర్ఎస్ నేత కవిత పేరు ఉన్న నేపథ్యంలో తెలంగాణలో ట్వీట్ల వార్ మొదలైంది. కవితను టార్గెట్ చేస్తూ ప్రత్యర్థి పార్టీలు ముఖ్యంగా బీజేపీ ట్వీట్ల యుద్ధం మొదలుపెట్టింది. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే కవితను లిక్కర్ క్వీన్ గా పేర్కొంటూ చార్జిషీట్లో 28 సార్లు కవిత పేరు ఉందంటూ ట్వీట్ చేశారు. కోమటిరెడ్డి ట్వీట్ కు స్పందించిన కవిత ఆయనకు వార్నింగ్ ఇస్తూ రీట్వీట్ చేశారు. రాజగోపాల్ అన్న తొందరపడకు, మాట జారకు “28 సార్లు” నా పేరు చెప్పించినా ” 28 వేల సార్లు ” నా పేరు చెప్పించినా అబద్ధం నిజం కాదు అని అని కౌంటర్ ఇచ్చారు కవిత. ఢిల్లీ మద్యం కుంభకోణంలో చార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ.. కవిత, వైసీపీ ఎంపీ శ్రీనివాసులు, ఆయన కొడుకు రాఘవారెడ్డి, అరబిందో డైరెక్టర్ శరత్ చంద్రా పాత్రలను వివరించింది.
అభిషేక్ బోయినపల్లి, బుచ్చిబాబు, అరుణ్ చంద్ర పిళ్ళై ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్టు ఈడీ కోర్టుకు తెలిపింది.
https://twitter.com/RaoKavitha/status/1605430251789565952?s=20&t=PIc-WCVziJfgTaWGGaP5bA
అయితే కవిత ట్వీట్ కు అదే స్థాయిలో బదులిచ్చారు రాజగోపాల్ రెడ్డి.నిజం నిప్పులాంటిది చెల్లెమ్మా. నువ్వు డిల్లీ లిక్కర్ స్కాంలో ఉన్నది నిజం.నువ్ జైలుకు వెళ్లడం ఖాయం. నిన్ను నీ అన్న, నాయన ఎవరూ కాపాడలేరు. మునుగోడు ఉపఎన్నికల్లో నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక పారదర్శక టెండర్ ద్వారా వచ్చిన 18వేల కోట్ల కోల్ బ్లాక్ టెండర్ విషయంలో నాపై విషప్రచారం చేసి నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసినందుకు రాబోయే రోజుల్లో అవినీతిమయం అయిన నీకుటుంబం మొత్తం జైలుకెళ్లడం ఖాయమని రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
https://twitter.com/krg_reddy/status/1605482219631529985?s=20&t=7HJVprm9S7nsZlnhrFRBag