ఓ సైకోను ఎమ్మెల్సీని చేసి…నాపైకి ఎగేస్తున్నారని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. హుజూరాబాద్ ప్రజలంతా పిచ్చోడు అని పిలిచే కౌశిక్ రెడ్డికి ప్రగతి భవన్ అండగా ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఈటల. తన కార్యకర్తలే కాక నియోజకవర్గ ప్రజలంతా అతని బాధితులేనని ఆరోపించారు. 20 కోట్ల సుపారీ మాట్లాడుకుని తనను చంపించే ప్రయత్నం చేస్తున్నారని..దానిపై ఫిర్యాదు చేశామని తెలిపారు. అయితే నయీం లాంటోడు బెదిరిస్తేనే భయపడలేదని.. ఈ స్థాయికి చేరినవాణ్ని ఇప్పుడు ప్రాణాలను లెక్కచేస్తానా అని ఆయన ప్రశ్నించారు. కౌశిక రెడ్డి తన చిల్లర పనులు ఆపకుంటే.. హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో, జమ్మికుంట గాంధీ చౌరస్తాలో చెప్పులు మెడకేసి ఊరేగిస్తామని తమ వాళ్లంటున్నారని ఈటల అన్నారు. హూజూరాబాద్ లో కౌశిక అరాచకాలపై పలుమార్లు పోలీసులకు, కరీంనగర్ సీపీకి చెప్పినా పట్టించుకోవడం లేదని గుర్తు చేశారు. నీచులను, శాడిస్టులను తనపైకి ప్రేరేపిస్తే ఊరుకునేదని హెచ్చరించారు.