బీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి ఇవాళ ఢిల్లీలో జాతీయ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయనకు కమిషన్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆయన మాటలు గవర్నర్ గౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయని మహిళా కమిషన్ నోటీసులో పేర్కొంది. తమ ఎదుట హాజరు కాకుంటే తదుపరి చర్యలుంటాయనీ హెచ్చరించింది. దీంతో ఆయన కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. గత నెల కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసైని ఉద్దేశించి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన వాడిన అసభ్య పదజాలంపై తీవ్ర విమర్శలు రావడంతో జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది.
జాతీయ మహిళా కమిషన్ ముందుకు కౌశిక్ రెడ్డి – గవర్నర్ తమిళిసై పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డి
Share: