కస్సుబస్సులాడే దీదీ డాన్స్ చేశారు.. ఎక్కడో తెలుసా..?
వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతా దీదీ అని పిలిచే మమతా గత పలు దఫాలుగా బెంగాల్ను ఏలుతోంది. అయితే గతకొద్ది రోజులుగా ఆమె తృణమూల్ కాంగ్రెస్ కోటలకు బీటలు వారుతున్నాయి. రాబోయే ఎన్నికల ముందు అనేక మంది నేతలు పార్టీకి గుడ్బై చెప్తూ దీదీకి చిర్రెత్తిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె కాస్త ఉపశమనం కోరుకుంటూ.. దేవాలయాల చుట్టూ వెళ్లడమే కాకుండా.. చిన్న చిన్న ప్రోగ్రామ్స్కు హాజరవుతున్నారు. తాజాగా మాల్గా జిల్లాలో స్థానికంగా జరిగిన సామూహిక వివాహ వేడుకలకు హాజరయ్యారు. అంతేకాదు అక్కడ ఆమె స్థానిక గిరిజనులతో కలిసి.. డాన్స్ కూడా చేశారు. దీదీ డాన్స్ చేసిన వేడుకల్లో దాదాపు 300 గిరిజన జంటలు ఒక్కటయ్యాయి. సీఎం మమతా బెనర్జీ ఈ సామూహిక వివాహా వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివాహ కార్యక్రమ అనంతరం.. గిరిజన మహిళలతో కలిసి జానపధ పాటలకు కాలు కదిపారు. దీదీ చేసిన ఈ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.