కాశీ “మజిలీ” కథ ఏందో!!
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుటుంబం కాశీ విశ్వనాథుని సేవలో తరిస్తోందట. వారణాసిలో కవిత తదితరులు గంగా హారతి ఇస్తున్న ఫొటోలు ఇవాళ పత్రికల్లో దర్శనమిచ్చాయి. కొడుకును సీఎం ను చేయడానికే ఈ కాశీ యాత్ర అంటున్నారు బండి సంజయ్. కాళేశ్వరం దగ్గర నదిలో పూజాసామగ్రి కలిపినట్టే కాశీ గంగానదిలో కూడా ఏమైనా కలుపుతారేమో అన్నారు. ముఖ్యమైన మంత్రి రామన్న సూత్రీకరణ ప్రకారం ముఖ్యమంత్రికి చాలా పనులుంటాయి. వారంలో రెండు సార్లు సినిమావాళ్లతో పిచ్చాపాటి కూడా ముఖ్యమైందే కదా. ఇంతలో హటాత్తుగా కాళేశ్వరం యాత్ర చేపట్టడమే విశేషం. ఆ తర్వాత వారణాసి టూర్ కు వెళ్లడం మరో విశేషం. ఈ యాత్రల ఖర్చును మనం, అంటే పన్ను చెల్లించే ప్రజలం భరించడం మరీ పెద్ద విశేషం.
కాశీలో తిష్టవేసి పూజలు పునస్కారాలు చేయడం ఎందుకో సీఎం దొరగారు తిరిగి వచ్చిన తర్వాతైనా చెప్తారో లేదో. గతంలో అయితే ముఖ్యమంత్రి సచివాలయంలో అందుబాటులో ఉండె. ఇప్పుడు గడీల పాలనలో సచివాలయానికి పోవడం లేదు సీఎం. కాబట్టి ఆయన చెప్పింది వినడమే తప్ప, అడిగే అవకాశం లేని బంగారు తెలంగాణలో బతుకుతున్నాం!!!