ది కశ్మీర్ ఫైల్ ద్వారా వాస్తవాలు బయటకొచ్చిన నేపథ్యంలో 33 ఏళ్లనాటి బాధితులు ఆసమయంలో తాము పడిన వేదనను సోషల్మీడియా వేదిగ్గా వెల్లడిస్తున్నారు. నాటి ఊచకోతకు ప్రత్యక్షసాక్షి ఆనాటి రాత్రి కశ్మీర్ ను వీడివెళ్లిన రాజీవ్ పండిట్ నాటి చీకటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం రాజీవ్ హిందూ అమెరికన్ ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో ఒకరు. 1990 ఫిబ్రవరి ఉగ్రవాది బిట్టా చేతిలో హత్యకు గురవకుండా తన మేనమామ టికూ ఎలా తప్పించుకున్నదీ..ఆయనకు బదులు మరో పండిట్ అయిన అనిల్ భాన్ ఎలా బలైంది చెప్తూ కన్నీటిపర్యంతమయ్యారు.

Anil Bhan (Right) was killed by Bitta Karate (Left) who mistaken him for another Kashmiri Pandit Ashok Tikoo
ఫరూఖ్ అహ్మద్ దార్ అలియాస్ బిట్టా కరాటే కశ్మీర్ లోయలోనే పెరిగాడు. రాజీవ్ పండిట్ సహా అక్కడి పిల్లలందరితో వీధిలో క్రికెట్ ఆడేవాడు. అతని మేనమామ బిట్టాకు పాఠశాలకు వెళ్లేందుకు పుస్తకాలు డబ్బులిస్తుండేవారు. అయితే క్రమంగా అతను తీవ్రవాదిగా మారాడు. శిక్షణకోసం ఉగ్రవాద శిబిరంలో చేరిపోయాడు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో శిక్షణ పొంది వచ్చిన తరువాత రాజీవ్ పండిట్ మేనమామను హత్యచేయమని అతనికి ఆదేశాలు వచ్చాయి. బిట్టా, మరో జేకేఎల్ఎఫ్ టెర్రరిస్ట్ ఆయనింటి దగ్గర కాపలాగా ఉండేవారు. ఫిబ్రవరి 16, 1990న రాజీవ్ మేనమామ ఇంటిదగ్గర్లో కాపలా ఉన్న మరో ఉగ్రవాది నుంచి ఇంట్లోనుంచి ఓవ్యక్తి బయటకెళ్లడం గమనించి బిట్టాకు సమాచారం ఇచ్చాడు. దీంతో అతన్ని చంపేదుకు బిట్టా సిద్ధమయ్యాడు. ఆఫీసుకు వెళ్లే దారిలో హబా కడల్లోని ఓ కూడలి దగ్గర అతని చంపేందుకు ప్లాన్ వేశాడు. అయితే ఆఫీస్ కు వెళ్తూ తన సోదరుడి పుట్టిన రోజు విషయం గుర్తుకువచ్చి పూజలో పాల్గొనాల్సి ఉందని వెనుదిరిగారాయన. ఆయన తిరిగి ఇల్లు చేరిన విషయం ఆ ఉగ్రవాది గమనించలేదు. కూడలి దగ్గరే కాపుకాస్తున్న వాళ్లు అదే సమయానికి ఆఫీసుకు వెళ్తున్న అనిల్ భాన్ అనే మరో పండిట్ ను పొట్టనపెట్టుకున్నారు. ఆయన కూడా రాజీవ్ మేనమామ ధరించినటువంటి లెదర్ జాకెట్ నే ధరించి ఉండడంతో టికూపండిటే అనుకుని పొరపడ్డారు ఉగ్రవాదులు. పిస్టల్ తో పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చి చంపారు. రక్తపు మడుగులో పడి ఉన్న కొడుకును చూస్తూ అనిల్ భాన్ తల్లి రోదించిన దృశ్యాలు ఎప్పటికీ మరిచిపోనంటూ నాటి విషాదాన్ని గుర్తు చేసుకున్నారు రాజీవ్ పండిట్.
https://twitter.com/rajiv_pandit/status/1505733492860141568?s=20&t=pLauz0szRYTwL97MH_mc8Q
2019లో ఆర్టికల్ 370 రద్దు చేసిన రోజు కూడా చాలామంది పండిట్లు వాళ్ల అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. కట్టుబట్టలతో కొందరు, చిన్న బ్యాగులు, సూట్ కేసులు పట్టుకుని పిల్లాపాపలతోప్రాణాలు అరచేతపెట్టుకుని పరుగుతీసిన దృశ్యాల్ని వారు అందరితో పంచుకున్నారు. ఆర్టికల్ 370 ఎత్తివేత తరువాత ఎక్కడెక్కడో స్థిరపడిన కశ్మీర్ హిందువులు సంబరాలు చేసుకున్నారు. ఆ ఆర్టికల్ లోనే కశ్మీర్ కు మిగిలిన భారతదేశానికి మధ్య చీలిక తెచ్చే బీజాలున్నాయంటారు రాజీవ్.
https://twitter.com/rajiv_pandit/status/1505733496383459334?s=20&t=6ojo8XDU9Xi4mZWSyhWWtQ
వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన కశ్మీర్ ఫైల్స్ సినిమా చూసి పండిట్లంతా తీవ్ర ఉద్వేగానికి గురవుతున్నారు. పూర్తి వాస్తవాలతో తాము పడిన హింసను చూపించారంటూ రాజీవ్ పండిట్ సహా పలువురు ట్విట్టర్ సహా ఇతర సోషల్మీడియావేదికలద్వారా ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నారు.
https://twitter.com/TheArvindDhar/status/1505759611152121858?s=20&t=_aTBSJYPnTyruR5oBm54jw