ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులు కుదుటపడుతున్నాయి. 90 వ దశకం నాటి అల్లర్లలో అనేక దేవాలయాలు శిథిలం అయిపోయాయి. ఇందులో అనంత్నాగ్లోని షాంగుస్ తాలూకాలోని ఉమా భగవతి ఆలయం కూడా ఒకటి. అత్యంత శక్తివంతమైన ఈ ఆలయాన్ని ఇప్పటిదాకా ఎవరు కదిలించలేదు. నరేంద్ర మోదీ ప్రభుత్వం పూనుకోవడంతో ఈ ఆలయం లో కదలిక వచ్చింది.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ సమక్షంలో ప్రత్యేక పూజలు చేసి ఆలయాన్ని తెరిపించారు.
ఉమా భగవతి దేవి విగ్రహాన్ని రాజస్థాన్ నుంచి తెప్పించి గర్భగుడిలో ప్రతిష్ఠించారు. 34 ఏళ్ల తర్వాత ఆలయాన్ని పునరుద్ధరించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 1990లో కూల్చివేసిన ఉమా భగవతి అమ్మవారి ఆలయం పునరుద్ధరించినట్టు కేంద్రమంత్రి నిత్యానంద్ రాయ్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జమ్మూ కశ్మీర్ అభివృద్ధికి, సంస్కృతి పరిరక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అభివృద్ధితో పాటు లోయలో శాంతి నెలకొల్పడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
బరారింగన్లోని ఉమా భగవతి ఆలయం అత్యంత పురాతనమైంది.కూల్చివేయడానికి ముందు ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించుకోడానికి జమ్మూ కశ్మీర్లోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు తరలివస్తుండేవారు. ఈ ఆలయం ‘బ్రహ్మ కుండ్, విష్ణు కుండ్, రుద్ర కుండ్, శివ శక్తి కుండ్’లతో సహా ఐదు నీటి బుగ్గల మధ్య ఉంటుంది. ఉమా నగ్రి, పరిసర ప్రాంతాల గ్రామస్తులు కశ్మీర్లోని ప్రశాంతమైన రోజులను గుర్తుచేసుకున్నారు. అడవి మధ్య ఉన్న ఈ పుణ్యక్షేత్రానికి స్వాంతన, మానసిక ప్రశాంతత కోసం వచ్చేవారమని తెలిపారు. ఆలయాన్ని తిరిగి తెరవడంతో కశ్మీరీ పండిట్లతో పాటు ముస్లింలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
📍 Anantnag, Jammu & Kashmir
Uma Bhagwati Mandir i.e. Ragnya Devi Mandir is over 500 years old.
It was vandalised by Islamists in late 1980s.
Now reopened after 34 years,
new moorti of Maa Uma Bhagwati installed with Pran-pratishtha.@narendramodi ji🙏pic.twitter.com/hzYOu1KWmc— Shashank Shekhar Jha (@shashank_ssj) July 16, 2024
మొత్తం మీద ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము కాశ్మీర్లో ప్రశాంత పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇందులో భాగంగా అనేక పురాతన దేవాలయాలను కూడా తెరిపిస్తున్నారు. సమాజం కలిసి మెలిసి ఉండేట్లుగా చొరవ తీసుకుంటున్నారు.