కాశ్మీర్ పై కేంద్రం పట్టు…
కాశ్మీర్ లోయలో ఉగ్రవాదుల దాడి వెనక చాలా భయంకరమైన కుట్ర ఉంది. అక్కడ టూరిజంను నాశనం చేయాలన్నది స్పష్టమైన వ్యూహం. బయటినుంచి టూరిస్టులు ఆగిపోతే,, స్థానిక యువత ఉపాధి కోల్పోతారు. అప్పుడు తిరిగి ఉగ్రవాదం వైపు మళ్ళుతారు అన్నది టెర్రరిస్టుల వ్యూహం.
కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వచ్చాక కాశ్మీర్లో పరిస్థితులు కుదుటపడ్డాయి. టూరిజం కళకళలాడుతుండడంతో,, ఉగ్రవాదులకు మనుషులు దొరకడం మానేశారు. దీనిని బద్దలు కొట్టేందుకు ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఒక్కసారిగా డాడీకి దిగి మొత్తం దేశాన్ని భయపెట్టాలని ప్రయత్నం చేశారు.
దీనిని గమనించిన కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. కాశ్మీర్ అంతట భద్రతను పటిష్టం చేసింది. దీంతో జమ్మూ కాశ్మీర్ .. క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటోంది. పర్యాటకుల సంఖ్య తగ్గినప్పటికీ, ఈ ప్రాంతం మరోసారి దేశీయ, అంతర్జాతీయ సందర్శకులను స్వాగతించడం ప్రారంభించింది. దేశియ, విదేశీ పర్యాటకులు.. కేంద్రం మీద విశ్వాసం ప్రకటిస్తున్నారు.
ఎక్కడికక్కడ భద్రతా బలగాలను కేంద్రం మోహరించింది. మళ్లీ ఇలాంటి ఘటనలు చెలరేగకుండా భద్రతా చర్యలను చేపట్టింది. కాశ్మీర్కు వచ్చే పర్యాటకుల భద్రతకు భరోసాను కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో పహల్గామ్లో నెమ్మదిగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. పర్యాటకులు క్రమం గా మళ్లీ కాశ్మీర్ పర్యటనలకు వస్తున్నట్టు తెలుస్తోంది. దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులు ఈ ప్రాంత భద్రతపై విశ్వాసం వ్యక్తం చేస్తూ తమ ప్రయాణ ప్రణాళికలను కొనసాగిస్తున్నారు.
దీనిని బట్టి కాశ్మీర్ ప్రజల మీద ఉగ్రవాదులకు ఏమాత్రం అభిమానం లేదనేది స్పష్టం అవుతోంది. మతం పేరు చెప్పి విధ్వంసానికి పాల్పడుతున్నప్పటికీ,, సొంత మతస్థుల నాశనం కోరుకుంటున్నారు అనేది అర్థం చేసుకోవచ్చు.