కశ్మీర్లో కానిస్టేబుల్ ను ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు.
పుల్వామాలోని గుడ్రూలో జమ్మూకశ్మీర్ కానిస్టేబుల్ ను ఇంటిదగ్గరే కాల్చిచంపారు. 24 గంటల్లో ఇది రెండో ఉగ్రహత్య.
ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ను రెయాజ్ అహ్మద్ థోకెర్గా గుర్తించారు. తీవ్రమైన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెయాజ్ కన్నుమూసినట్టు కశ్మీర్ జన్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ తెలిపారు.
బుద్గాం జిల్లా ఛదూరలోని తహసిల్ కార్యాలయంలో పనిచేస్తున్న కశ్మీర్ పండిట్ రాహుల్ భట్ను గురువారం ఉగ్రవాదులు కాల్చిచంపారు.
నిరసనగా స్థానికులు శ్రీనగర్-బుద్గాం హైవేను దిగ్బంధించేయత్నం చేశారు. పోలీసులు బాష్పవాయి గోళాలు ప్రయోగించి వారిని చెదరగొట్టారు.
ఈ ఘటన సిగ్గుచేటంటూ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అంటే.., కశ్మీర్లో సాధారణ పరిస్థితులున్నాయన్న కేంద్ర వాదన తప్పని రుజువైందని మెహబూబా ముఫ్తీ అన్నారు.
Rahul in his office yesterday, Riyaz Ahmad Thoker, a SPO with J&K police, in his own home today. Targeted killings continue unabated. I can’t condemn this killing strongly enough. May Allah grant Riyaz place in Jannat https://t.co/WyYifdHWKe
— Omar Abdullah (@OmarAbdullah) May 13, 2022