1990లో కాశ్మీర్ లోయ లోని పండిట్లు తమ మాతృ భూమి నుంచి వలస వెళ్ళడానికి దారితీసిన మారణహోమంపై దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రం విజయవంతంగా ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షించింది. ఈ చిత్రం కాశ్మీరీ హిందువుల బాధలను వెలుగులోకి తెచ్చింది. నాటి అత్యంత దిగ్భ్రాంతికరమైన సంఘటనలలో ఒకటి కాశ్మీరీ పండిట్ అయిన గిరిజా టికూపై క్రూరమైన హత్య. ఆమె బ్రతికి ఉండగానే సామూహిక అత్యాచారానికి గురై, తర్వాత వడ్రంగులు వాడే రంపంతో సజీవంగానే సగానికి నరికివేయబడింది.
మూడు దశాబ్దాలుగా మౌనంగా ఉన్న గిరిజ కుటుంబం ఎట్టకేలకు ఈ ఘటనపై స్పందించింది. ఆమె మేనకోడలు సిద్ధి రైనా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ ద్వారా తన బాధను వెళ్లగక్కారు. అక్కడ తన కుటుంబం ఇప్పటికీ న్యాయం కోసం ఎలా ఎదురుచూస్తుందనే దాని గురించి మాట్లాడింది. గిరిజకు ఏం జరిగిందో వివరిస్తూ, ఆమె కుటుంబం తోపాటు ప్రతి కాశ్మీరీ పండిట్ కుటుంబం అనుభవించిన భయానక రాత్రులను ఈ చిత్రం చూపిస్తుందని.. అంతే కాకుండా ప్రతి ఒక్కరూ సినిమా చూడాలని కోరింది.
” మా నాన్న సోదరి గిరిజా టికూ, ఒక యూనివర్శిటీలో లైబ్రేరియన్గా పని చేసేది. ఆమె జీతం తీసుకోవడానికి వెళ్ళి తిరిగి వస్తుండగా ఆమె ప్రయాణిస్తున్న బస్సు ఆగిపోయింది. అప్పుడు ఆవిడను ఐదుగురు వ్యక్తులు (వారిలో ఒకరు ఆమె సహోద్యోగి)తో ట్యాక్సీలోకి విసిరారు, వారు ఆమెను హింసించారు.. ఆమెపై అత్యాచారం చేశారు.. ఆపై ఆమెను వడ్రంగుల రంపంతో సజీవంగా నరికి దారుణంగా హత్య చేశారు. ఆ ఘటనను గుర్తు చేసుకుంటే నాకు ఇప్పటికీ వణుకు, కన్నీళ్లు సహా వికారం కూడా వస్తాయి. అలాంటి స్థితిలో తన సోదరిని గుర్తించాల్సిన పరిస్థితుల్లో మా నాన్నని ఊహించుకోండి. ఆ ఘటన పై ఎవరూ మాట్లాడటం తాను వినలేదని” అన్నారు. ప్రతి ఒక్కరూ సినిమా చూడవలసిందిగా రైనా కోరుతూ, “కాశ్మీర్ ఫైల్స్ని చూసి మీ స్నేహితులు, కుటుంబ సభ్యులను మీతో పాటు తీసుకెళ్లాలని మీ అందరికీ ఇది నా విజ్ఞప్తి” అని జోడించారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)