కశ్మీర్ పండిట్లను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుని మళ్లీ రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే కొందరు పండిట్లను ఉగ్రవాదులు హత్యచేశారు. తాజాగా రాహుల్ భట్ ను టెర్రరిస్టులు పొట్టనపెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో మే 15న సోషల్మీడియాలో వైరల్ అయిన ఓ లేఖ కలకరం రేపింది. “వలసదారులు, RSS ఏజెంట్లు అందరూ వెళ్ళిపోవాలి.. లేకుంటే చస్తారు. కశ్మీరీ ముస్లింలను చంపాలని.. కశ్మీర్లో మరో ఇజ్రాయెల్ కోరుకునే పండిట్లకు ఇక్కడ చోటులేదు. సెక్యూరిటీ పెంచుకుంటరా…చావడానికి సిద్ధంగా ఉండండి. మీ అంతం తథ్యం.” అని ఉగ్రవాద సంస్థ ‘లష్కరే ఇస్లాం’ లేఖలో రాసింది.
అయితే ఆ లేఖ ఇప్పటిది కాదని తెలిసి కాస్త ఊపిరి పీల్చుకున్నారు స్థానికులు, అధికారులు. అసలైతే ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ విడుదల చేసిన ఆ లేఖను ఆగస్టు 2016లో DNA మీడియాలో ప్రచురితం అయింది. దాన్ని ఇప్పుడు CNN న్యూస్18 అసిస్టెంట్ ఎడిటర్ తేజిందర్ సింగ్ సోధి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అంతటా కలవరం రేగింది. దక్షిణ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలోని మైగ్రంట్ కాలనీ హవాల్ చుట్టూ భద్రతను పెంచారు. విచారణలో లేఖ ఫేక్ అని, అది ఎప్పటిదోనని తేలింది.
జమ్మూ కాశ్మీర్లోని బుద్గామ్ జిల్లాలో కాశ్మీరీ పండిట్ ప్రభుత్వ ఉద్యోగి రాహుల్ భట్ను ఉగ్రవాదులు కాల్చి చంపిన కొద్ది రోజులకే ఇది జరిగింది. సెంట్రల్ కాశ్మీర్లోని చదూరాలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద మధ్యాహ్న సమయంలో అతనిపై దాడి జరిగింది” అంటూ ఈ కథనాన్ని అదే రోజు మీడియా పబ్లికేషన్ ఇండియా టుడే కవర్ చేసింది.