ముస్లిం రాజుల పాలనలో 8 వందల ఏళ్లపాటు హిందుస్థాన్ శాంతియుతంగా ఉందని …ఇప్పుడు ‘దికశ్మీర్ ఫైల్స్ ‘ సినిమా ప్రదర్శనను ఆపకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు కశ్మీర్ రాజౌరీకి చెందిన మౌలీ మౌలానా ఫరూఖ్. లేకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని చిత్ర దర్శక నిర్మాతలను బెదిరించాడు.
కశ్మీరీ హిందువుల మారణహోమం నేపథ్యంలో వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ది కశ్మీర్ ఫైల్స్ దేశవ్యాప్తంగా విజయవంతంగా ఆడుతున్న సంగతి తెలిసింది. కశ్మీర్లో ఇంతటి అమానవీయ ఘటన జరిగిందా అంటూ దేశం విస్మయం చెందుతోంది. అయితే నాడు హిందువుల హత్యలకు సూత్రధారులు, పాత్రధారులు అయిన కశ్మీరీ ముస్లింల అసలు ముఖం బయటకు రావడంతో వాళ్లు ఉలిక్కిపడుతున్నారు. ఏకంగా చిత్ర యూనిట్ నే భయపెడుతూ హెచ్చరికలు చేస్తున్నారు కొందరు. ఇక కశ్మీర్ రాజౌరికి చెందిన మౌల్వి ఫరూఖ్…సినిమా ప్రదర్శనను ఆపకుంటే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించారు.
మౌల్వీ బెదిరింపులకు సంబంధించిన వీడియోను జర్నలిస్ట్ ఆశిష్ కోహ్లి విడుదల చేశారు. సినిమాలో కశ్మీరీ పండిట్ల హత్యల గురించి మాత్రమే చెప్పారని…కానీ వేలాదిమంది ముస్లింల హత్యలను ఎందుకు చూపించలేదని మౌల్వీ ప్రశ్నించారు. ఈ సినిమా ముస్లింలకు వ్యతిరేకంగా ముందస్తు ప్రణాళికతో తీశారని ఆరోపించారు. ఇక సినిమాను ప్రమోట్ చేశారంటూ మోదీపై, కేంద్రంపై దాడి చేశారు ఫరూఖ్. కశ్మీర్ ఫైల్స్ ను తాము అంగీకరించహబోమనీ సహించబోమనీ అన్నారు. ఈ సినిమా పై ఆంక్షలు విధించాలని…పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేస్తూ…ఈ దేశాన్ని శాంతియుతంగా ఉంచాలనే తాము అనుకుంటున్నామని ఫరూఖ్ అన్నారు. అయితే సినిమాపై నిషేధాన్ని కోరుతూ… ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. 800 ఏళ్లు ఈ దేశాన్ని ముస్లింలు పాలించారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నాడు. మీరు మమ్మల్ని లక్ష్యంగా చేసుకోవాలనుకుంటున్నారు. కానీ వాస్తవం ఏంటంటే అందుకు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. అంతం కాక తప్పదు. మీరు ముస్లింలను ఏమీ చేయలేరు అనీ అన్నారా మౌల్వీ.
ఫరూఖ్ రాజౌరీ జిల్లాలోని ఓ మసీదు దగ్గర ఈ ప్రసంగం చేశాడు. ఆసమయంలో అక్కడ పెద్దఎత్తున గుమికూడిన ముస్లింలు నారా-ఎ – తక్బీర్ అంటూ నినాదాలు చేశారు.