ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులను భద్రతాబలగాలు అరెస్ట్ చేశాయి. కశ్మీర్ బుద్గామ్ జిల్లాలో ఆయుధాలు, మందుగుండుసామగ్రితో తిరుగుతున్న వారిని పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు. బుద్గాం జిల్లా సున్నెర్గుండ్ ప్రాంతంలో వారిని అరెస్ట్ చేశారు. షోపియాన్ జిల్లాకు చెందిన అహ్మద్ గనై, ఇక్బాల్ అష్రాఫ్ షేక్గా గుర్తించారు. వారినుంచి చైనా
చైనా పిస్తోలు, రెండు పిస్తోల్ మేగజైన్లు, 12 పిస్టర్ రౌండ్లు, 32 ఎకే-47 రౌండ్లు స్వాధీనం చేసుకున్నారు.