ఇప్పుడు చెప్పబోయే విషయం మనకు తెలియనిది కాదు. ఇప్పుడు తాలిబాన్లు కశ్మీర్ని విముక్తి చేయడంపై దృష్టి సారించినందున ఆ తెలిసిందే మరొక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోవడం కోసం ఇది రాశాను. ఉదాసీనంగా ఉండటమే కాకుండా అసలు ఆసక్తి కూడా చూపని ఎవరు అయితే భారతీయ హిందూ ప్రవాసులు ఉన్నారో వారిని దృష్టిలో వుంచుకుని ఇది రాశాను. కానీ మనం వారిని ఒక్కరినే తప్పు పట్టలేం. ఎందుకంటే ఈ విషయంపై భారతదేశంలోనే పట్టించుకోనీ గణనీయమైన హిందూ జనాభా ఉంది కాబట్టి. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ప్రవాసుల నుండి విస్తృతమైన మద్దతు లభిస్తున్న కారణంగా మాత్రమే ఇజ్రాయెల్ వంటి ఒక చిన్న దేశం ఇంకా మనుగడ సాగిస్తున్నాది అనే విషయం మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి.
“కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం “. ఈ వాక్యం అందరు రాజకీయ నాయకులు పలు సార్లు చిలక పలుకులుగా పలకడం నేను విన్నాను.

కానీ కాశ్మీర్పై నా మొత్తం దృక్పథాన్ని పూర్తిగా మార్చిన నిజాలను ఇటీవలే నేను కనుగొన్నాను.
ఈ వాస్తవాలు నన్ను బాగా ఆశ్చర్యానికి గురిచేశాయి. కానీ అన్నిటికంటే నన్ను దిగ్భ్రాంతికి గురిచేసిన విషయం ఏమిటంటే మనకి చరిత్ర ఎంత వక్రంగా తెలిపారో ఈ వాస్తవాలు తెలియచేసాయి.
బ్రిటిష్ వారు మన గొప్పతనాన్ని తగ్గించడానికి మరియు తమ చరిత్ర తెలుసుకునేందుకు భారతీయులందరూ సిగ్గు పడేటట్లు సిలబస్ని తయారు చేశారు అంటే మనం అర్థం చేసుకోవచ్చు.
కానీ, స్వాతంత్య్రం వచ్చిన 70 సంవత్సరాల తరువాత కూడా ఇప్పటికీ మనం వారి రాతలకే కట్టుబడి ఉన్నాము అంటే సిగ్గుపడాల్సిన విషయం.
నేను ఇప్పుడు చెప్పబోయేవి వాస్తవానికి మన సంస్కృతి ప్రవాహానికి కాశ్మీర్ ఫౌంటెన్హెడ్ అని రుజువు చేస్తాయి. అంతే కాదు అసలు వాస్తవానికి భారతీయులుగా మన గుర్తింపును ఇచ్చే ప్రతీదీ కూడా ఈ కాశ్మీర్ తో ముడిపడి వుంది అనడం కూడా అతిశయోక్తి కాదు.
నేను గతంలో పాఠ్య పుస్తకాల ద్వారా తెలుసుకున్న భారతదేశ చరిత్రలో కాశ్మీర్ యొక్క ఈ ప్రాముఖ్యత గురించి నాకు అస్సలు యే విధమైన సమాచారం ఇవ్వబడలేదు.
ఇప్పుడు నేను తెలుసుకున్న వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి :
ప్రపంచంలో వ్యాకరణంపై అత్యంత * శాస్త్రీయ మరియు దోషరహిత గ్రంథంగా పరిగణించబడిన అష్టాధ్యాయి రాసిన పాణిని నివాసం కాశ్మీర్!*
* అంతే కాదు “సంగీత రత్నాకరం” వ్రాసిన, హిందూస్తానీ మరియు కర్ణాటక సంగీతం రెండింటి పితామహుడిగా పిలువబడే “సారంగ్దేవ్” కాశ్మీర్ కి చెందిన వాడు*

* “అభినవ్ భారతి “తో సహా 46 సాహిత్య క్లాసిక్లు రాసి అన్ని కాలాలలోనూ గొప్ప పండితులలో ఒకడుగా ప్రసిద్ధ గాంచిన ఆచార్య అభినవ్ గుప్త్ ది కాశ్మీర్.. ఈయన చెప్పిన “రస- భావ” అంటే కళల లో గల నవ రసాలను గూర్చి ఆయన చెప్పిన సూత్రాలు నేటికీ ప్రపంచంలోని 80 విశ్వవిద్యాలయాలలో బోధించబడుతున్నాయి!*

* కాశ్మీర్ భారతదేశంలో అత్యున్నత విద్యాభ్యాసం చేసే సరస్వతి నివాసంగా పరిగణించబడేది. దీనిని శారదా పీఠం అని కూడా అంటారు. కాశీ నుండి విద్యార్థులు పట్టభద్రులైనప్పుడు, ఉన్నత విద్య కోసం వారి ఆకాంక్షను తెలియచేసే సూచికగా వారు కాశ్మీర్ దిశగా నాలుగు అడుగులు వేసేవారట “*

*దాదాపు భారత దేశ మొత్తం సంస్కృత సాహిత్యం మూలాలు కాశ్మీర్లో ఉన్నాయి అంటే అతిశయోక్తి కాదు*
*12 వ శతాబ్దంలో కల్హణుడు రాసిన రాజరంగిణి అంటే కాశ్మీర్ రాజ వంశంపై అధికారిక చరిత్ర గ్రంధం. ఇది రాజు లలితాదిత్య యొక్క గొప్పతనాన్ని వివరిస్తుంది. ఇతడినే బహుశా భారత్ లో అన్ని కాలాలలోనూ అత్యంత శక్తివంతమైన భారతీయ చక్రవర్తిగా పేర్కొనవచ్చు. 8 వ శతాబ్దంలో వీరి రాజ్యం ఉత్తరాన కాస్పియన్ సముద్రం నుండి దక్షిణాన కావేరీ బేసిన్ వరకు, మరియు తూర్పున అస్సాం వరకు విస్తరింపబడి వుండేది.(దీనిపై కొంత వివాదం వుంది)!*

*ఎంత మంది భారతీయులు ఇతని పేరు కనీసం విన్నారు ???*
*శ్రీనగర్ అశోకుడు స్థాపించినది, ఆ మహాయాన బౌద్ధమతం మధ్య ఆసియా, చైనా మరియు జపాన్లలో కాశ్మీరీ సన్యాసుల ద్వారా వ్యాపించింది అని ఎంత మందికి తెలుసు? *
మన పురాతన గ్రంథాలలో కూడా ప్రస్తావించబడినట్లు సహస్రాబ్దాలుగా కాశ్మీర్ మన వారసత్వానికి కీలకం అని వర్తమాన మరియు భవిష్యత్తు తరాలు ఎలా గుర్తించగలవు?
మన పాఠ్యపుస్తకాల నుండి చరిత్రలోని ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా దాచివుంచిన ఈ విద్యావేత్తలు ఎవరు? వారి అజెండా ఏమిటి?
*కాశ్మీర్ కేవలం భూమి యొక్క ముక్క కాదు. ఇది భారతదేశ ఆత్మ*.
*కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం”
అవును. ఇప్పుడు నిజమే నాకు దీనికి కొత్త అర్థం తెలిసింది.
* ఇది ఒక అజ్ఞాత రచయిత ఇంగ్లీష్ వ్యాసం*