కాశీ విశ్వనాథ మందిరం ఆలయ శిఖరం, ప్రధాన దర్వాజాలకు బంగారు పూత పనులు పూర్తయ్యాయి. బయటి గోడల పునరుద్ధరుణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆలయ శిఖర దిగువ భాగం తాపడం కోసం 23 కిలోల బంగారాన్ని ఉపయోగించారు. ఈ బంగారు పూత పనుల కోసం… ఓ భక్తులు 60 కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చాడు. శిఖరం, దర్వాజాలకు తాపడం పూర్తికావడంతో ఆలయం సుందరంగా దర్శనిమిస్తోంది.
ఈ ఏడాది మార్చిలో ఆలయ గర్భగుడి లోపలి గోడలకు బంగారం పూత పూశారు. అజ్ఞాత దాత ఇచ్చిన 60 కిలోల బంగారంలో 37 కిలోల బంగారాన్ని అందుకు వినియోగించారు.
డిసెంబర్ 2021లో కాశీ విశ్వనాథ కారిడార్ ప్రారంభోత్సవానికి నెలరోజుల ముందు పేరు చెప్పడం ఇష్టం లేని భక్తుడు ఆ బంగారాన్ని స్వామికి విరాళంగా అందజేశాడు. గుజరాత్ , ఢిల్లీకి చెందిన ప్రత్యేక నిపుణులు గుడి అంతర్భాగానికి తాపడం పనులు చేశారు. ఆలయ శిఖరం కోసం 23 కిలోలు పట్టింది.
ఆలయానికి బంగారు పూత పూసే కార్యక్రమం మూడు దశల్లో ప్రారంభమైంది. గోడలపై మొదట పూత పూసిన ప్లాస్టిక్ పొరతో, తర్వాత రాగి రేకులతో, చివరగా బంగారు రేకులతో కప్పారు. ఆలయ అధికారులు 6 సంవత్సరాల క్రితం ప్రాజెక్టును చేపట్టాలని అనుకున్నారు. ఇందుకోసం రూ.42 కోట్లు అవుతాయని అంచనా వేశారు. అయితే పురాతన దేవాలయం ఆ భారాన్ని మోయలేదని.. వారణాసిలోని ఐఐటీ (బీహెచ్యూ) తన నివేదికలో చెప్పడంతో ఆ ప్రణాళికను నిలిపివేశారు.
KVT dome starts glittering with 23kg gold pic.twitter.com/2RlioAZDpU
— Government of UP (@UPGovt) June 8, 2022
కాశీ విశ్వనాథ ఆలయానికి బంగారు పలకను తయారు చేయడం ఇది రెండవసారి. 18వ శతాబ్దానికి ముందు, పంజాబ్ మహారాజా రంజీత్ సింగ్ ప్రత్యేకంగా రెండు ఆలయ శిఖరాలను టన్ను బంగారంతో తాపడం చేయించారు.
ప్రధాని చొరవ తీసుకుని… కాశీ విశ్వనాథాలయాన్ని 2,700 చదరపు అడుగుల నుంచి 5 లక్షల చదరపు అడుగులకు విస్తరించారు. 900 కోట్ల రూపాయలతో కాశీ విశ్వనాథ్ ధామ్ కారిడార్ ప్రాజెక్టు కింద ఈపనులు అయ్యాయి. జలసేన్, మణికర్ణిక మరియు లలితా ఘాట్ల ద్వారా కాశీ విశ్వనాథ దేవాలయం , గంగా నది మధ్య ప్రత్యక్ష కనెక్టివిటీని ఏర్పాటు చేసింది.
జూన్ 7న పూర్తయిన బంగారు తాపడం ప్రాజెక్టును రెండు షిఫ్టుల్లో 10 మంది చేశారు. ఇప్పుడిక ప్రాంగణంలో కళాత్మక గోడ పునరుద్ధరణ కార్యక్రమం ప్రారంభమైంది. హానికరమైన ఎనామెల్ పెయింట్ తొలగించిన పనులు మొదలుపెట్టారు. ఈనెలాఖరుకల్లా ఆ పనులు కూడా పూర్తి చేయనున్నారు.
Kashi Vishwanath gets a Golden Makeover
Ahead of Maha Shivratri tomorrow, Garbh Grih in Kashi Vishwanath Temple has been decorated with 60 kg gold donated by an anonymous Bhakt from South India
Before this, Maharaja Ranjeet Singh had donated gold for temple’s Shikhar in 1853 pic.twitter.com/I9gK4EUSId
— The Uttar Pradesh Index (@theupindex) February 28, 2022