హిందూ ధర్మ జాగరణ మండలి ఆధ్వర్యంలో శనివారం రాత్రి స్థానిక రామాలయంలో కార్తీక దీపోత్సవం,తులసి దామోదర కళ్యాణం నిర్వహించారు.
గ్రామంలోని మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపారాధన చేశారు. నిర్మల్ నుండి వచ్చిన పండితుల బృందం,రామాలయ పూజారి ఈ కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించారు… వివిధ ఆకృతులలో ఏర్పాటు చేసిన దీపాలు ఆకట్టుకున్నాయి.