చైనీయులకు వీసాలకు సంబంధించిన కుంభకోణం కేసులో కార్తి చిదంబరంతోపాటు మరికొందరిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీలాండరింగ్ కేసును నమోదు చేసింది. 2011లో చిదంబరం హోంమంత్రిగా ఉన్న కాలంలో స్కాం జరిగింది. ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన కేసు ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఈ కేసునమోదు చేసింది.
CBI నమోదు చేసిన కేసు ఆధారంగా ఈ కేసు నమోదు చేసినట్టు ఈడీ తెలిపింది. వేదాంత గ్రూప్ కంపెనీ తల్వండి సబో పవర్ లిమిటెడ్ (TSPL) పంజాబ్లో ఓ విద్యుత్తు ప్లాంటును ఏర్పాటు చేసింది. ఈ సంస్థకు చెందిన టాప్ ఎగ్జిక్యూటివ్ రూ.50 లక్షలు లంచం కార్తి చిదంబరానికి, ఆయన సన్నిహితుడు ఎస్ భాస్కరరామన్కు చెల్లించినట్టు తేలింది. అయితే ఈడీ ఆరోపణలను కార్తీ తోసిపుచ్చారు. తనను కావాలనే వేధిస్తున్నారని ఆరోపించారు.