కర్ణాటకలోని మంగళూరు శివార్లలో పాత మసీదు క్రింద హిందూ దేవాలయాన్ని ఆనవాలు బయటపడ్డాయి.
పట్టణ శివారు మలాలిలోని జుమా మసీదులో పునరుద్ధరణ పనులు జరుగుతుండగా…చక్కటి శిల్ప సౌందర్యంతో కూడిన స్తంభాలున్న ఆలయం బయటపడింది. ఆలయాన్ని ఆక్రమించి దానిపైన మసీదు నిర్మించి ఉంటారని భావిస్తున్నారు. అయితే ఆ ఆలయం ఎన్నేళ్ల క్రితంది, ఏ రాజుల కాలంలో ఆక్రమణకు గురైందన్నది తేలాల్సి ఉంది. మసీదు కింద బయటపడిన ఆలయాన్ని చూసేందుకు స్థానికులు తరలివస్తున్నారు.
అయితే దాని చరిత్రకు సంబంధించిన ఆధారాలు, పత్రాలను ధ్రువీకరించేవరకు మసీదు పునరుద్ధరణ పనులు ఆపాలని స్థానిక వీహెచ్పీ ప్రతినిధులు జిల్లా యంత్రాంగానికి విజ్ఞప్తి చేశారు. దీంతో తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు నిర్మాణ పనులు ఆపాలని దక్షిణ కర్నాటక కమిషనరేట్ సైతం మసీదు నిర్వాహకులను ఆదేశించింది. భూ రికార్డులు పరిశీలిస్తామని..ఇతర ఆధారాలుంటే తమ దృష్టికి తేవాలని ఇరువర్గాలు సంయమనం పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
ఇక పాత రికార్డులు, భూయాజమాన్యం వివరాలకు సంబంధించి అన్నీ సమగ్రంగా పరిశీలిస్తామని..ఎండోమెంట్, వక్ఫ్ బోర్డు నుంచి నివేదికలు తీసుకుంటామని దక్షిణ కన్నడ డిప్యూటీ కమిషనర్ రాజేంద్ర కెవి తెలిపారు.
ఇరువర్గాల వాదనలు వింటామని…తగిన నిర్ణయం తీసుకుంటామని ఎవరూ తొందరపడవద్దని..శాంతిభద్రతలను కాపాడేలా సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.