అత్యంతకర్కషంగా జంతువులను వధించే హలాల్ పై కర్నాటక ప్రభుత్వం దృష్టి సారించింది. కబేళాల్లో వాటిని వధించే ముందు అపస్మారక స్థితికి తీసుకురావడం తప్పని సరి చేయాలని బృహత్ బెంగళూరు మహానగర పాలక సంస్థ బీబీఎంపీకి సూచించింది ప్రభుత్వం. వాటిని హింసించి చంపే పద్ధతిని విడనాడాలనీ అభిప్రాయపడింది. ఈమేరకు నగరపాలికను కోరిన కర్నాటక రాష్ట్ర పశుసంవర్థక శాఖ… మాంసం దుకాణాలకు లైసెన్సులు ఇచ్చేముందు ఈ సౌకర్యాలు ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలని కోరింది.
ఒక జంతువును వధించేటప్పుడు తలపై కొట్టడం ద్వారా.. గ్యాస్.. లేదా విద్యుత్ షాక్ ద్వారా అపస్మారకస్థితికి తీసుకెళ్లవచ్చనీ అభిప్రాయ పడింది. అయితే ఈ పద్ధతిని చాలాస్లాటర్ హౌసులు, చికెన్ స్టాల్స్ ను అనుసరించడం లేదని ప్రజలనుంచి ఫిర్యాదులు వచ్చినట్టు డిపార్ట్ మెంట్ తెలిపింది.
హలాల్ ఉత్పత్తులను నిషేధించాలని దేశవ్యాప్త చర్చ నడుస్తున్న సమయంలో…హిందూజనజాగృతి సమితి హలాల్ మాంసాన్ని బహిష్కరించాలనే డిమాండ్ తో ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో కర్నాటకలోనూ హలాల్ మాంసంపై విస్తృత చర్చే నడుస్తోంది. ఈ చర్చలు, ఆందోళనల మధ్య పశుసంవర్దకశాఖ నుంచి నగరపాలికకు ఈ ఆర్డర్ వచ్చింది.
హలాల్ ధృవీకరణ ఇస్లాంలో పంది మాంసం, జంతువుల కొవ్వులు, పాల ఉత్పత్తులు సహా ఆల్కహాల్ మినహాయించి అన్ని ఆహార పదార్థాలనూ లేబుల్ చేస్తోంది.
స్టన్నింగ్ ప్రక్రియలో వివిధ రకాల షాక్ పద్ధతులను ఉపయోగిస్తారు, తద్వారా అది వధకు ముందు అపస్మారక స్థితికి చేరుకుని నొప్పి లేకుండా మరణిస్తుంది. అయితే కొంత మంది ఇస్లామిక్ పండితులు మాత్రం ఈ స్టన్నింగ్ ప్రక్రియ ఇస్లాం సూత్రాలకు విరుద్ధమని వాదిస్తున్నారు. వారి నమ్మకం ప్రకారం జంతువు సజీవంగా ఉండాలి. స్టన్నింగ్ ప్రక్రియలో జంతువును అపస్మారకస్థితిలోకి వెళ్లేలా చేస్తే అది చనిపోయే అవకాశం ఉందని..దాన్ని హలాల్ మాంసంగా తాము భావించమని ముస్లిం కమ్యూనిటీ వాదిస్తోంది.