ప్రభుత్వ మైనార్టీ విద్యాసంస్థల్లోనూ హిజాబ్, కాషాయ కండువాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కర్నాటక ప్రభుత్వం. మైనార్టీ సంక్షేమ, హజ్, వక్ఫ్ శాఖ సెక్రటరీ మేజర్ మణివణ్నన్ ఈ మేరకు సర్క్యులర్ జారీ చేశారు.
ఇటీవల కర్నాటక హైకోర్టు కూడా మధ్యంతర ఉత్తర్వులిస్తూ…విద్యార్థులు మతం, మత విశ్వాసాలతో సంబంధం లేకుండా రావాలని…ఎవరైనా సరే హిజాబ్ కానీ, కండువా కానీ, ఇతర మత చిహ్నాలు ధరించరాదని ఆదేశించిన సంగతి తెలిసిందే. అసలైతే న్యాయ విచారణ జరుగుతుండగానే కోర్టు తీర్పును ధిక్కరిస్తూ హిజాబ్ తో అనుమతించాలని పట్టుబట్టిన సంగతి తెలిసిందే.
కర్ణాటక మైనారిటీ సంక్షేమ శాఖ జారీ చేసిన ఆదేశం ఇలా పేర్కొంది, “పైన పేర్కొన్న హైకోర్టు తీర్పు మైనారిటీ సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు, మౌలానా ఆజాద్ మోడల్ ఇంగ్లీష్ మీడియం సంస్థలకు వర్తిస్తుంది. ఆయా విద్యా సంస్థలన్నింటిలోనూ విద్యార్థులు హిజాబ్, కాషాయ కండువాలు ధరించకూడదు’ అని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది.
Karnataka Minority Welfare Department restrains students of schools under the Dept from wearing saffron shawls, scarfs, hijab, religious flags or similar inside classrooms until further orders pic.twitter.com/xPjfR74Np6
— ANI (@ANI) February 17, 2022
విద్యార్థులందరూ ఎలాంటి మతపరమైన దుస్తులు ధరించి విద్యా సంస్థలకు వెళ్లరాదని కర్ణాటక హైకోర్టు ఈ నెల 10న ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషన్ల పరిశీలన పెండింగ్ లో ఉందని… తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు మత విశ్వాసాలతో సంబంధం లేకుండా కేవలం యూనిఫాంలోనే తరగతులకు హాజరు కావాలని స్పష్టం చేసింది. యూనిఫాం డ్రెస్ కోడ్ నిబంధనలు ఉన్న సంస్థలు ఈ ఆదేశాలు పాటించాలనీ అంది. హైకోర్టు మధ్యంతర తీర్పు డిగ్రీ కళాశాల విద్యార్థులకు వర్తించదని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి సిఎన్ అశ్వత్నారయన్ ప్రకటించిన తరువాత రోజు ఈ ఆదేశాలు వచ్చాయి.
ఇక కర్నాటక ఉడిపిలో ప్రి యూనివర్సిటీ స్కూల్లో తలెత్తిన హిజాబ్ దుమారం ఇతర రాష్ట్రాలకూ వ్యాపించింది. కొందరు ముస్లిం విద్యార్థులు హిజాబ్ కోసం పట్టుబట్టడంతో వివాదం మొదలైంది. ప్రతిచర్యగా హిందూ విద్యార్థులు కాషాయ కండువాలతో హాజరవడంతో వివాదం ముదిరింది.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)